సాదాసీదాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశం
చైర్పర్సన్ సంధ్యారాణి అధ్యక్షతన తొలి సాధారణ సమావేశం
36 అంశాలకు ఆమోదం.. ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన సభ్యులు
కాకతీయ, రామకృష్ణాపూర్: క్యాతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోడిసెల సంధ్యారాణి అధ్యక్షతన బుధవారం తొలి కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, పాలనాపరమైన 36 అంశాలతో కూడిన ఎజెండాను ఇంచార్జ్ మేనేజర్ సతీష్ సభలో చదివి వినిపించారు. ఈ అంశాలన్నింటికీ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశం ఎటువంటి వాదోపవాదాలు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డీఈ సుమతి, ఏఈ ఆశ్రిత్, టీపీఎస్ రాజ్ కుమార్ మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

