వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి
•జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు,నిల్వ,రవాణా ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మందమర్రి మండలంలోని శ్రీ వాసవి,అంబికా సాయి,సప్తగిరి రైస్ మిల్లులతో పాటు సారంగపల్లి,పొన్నారం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి సిఎంఆర్ ప్రక్రియలను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా,వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు,టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు,ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

