epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చచ్చిన మేకలనే కోస్తాం.. ఐతే ఏంటి!

చచ్చిన మేకలనే కోస్తాం.. ఐతే ఏంటి!
మామూళ్లు ఇస్తున్నాం.. మా జోలికి రారు
అధికారుల‌పై మటన్ వ్యాపారుల బరితెగింపు
మణుగూరు ప్రజల ఆరోగ్యంతో చెల‌గాటం
ఫిర్యాదులు వెళ్లినా ప‌ట్టించుకోని  శాఖల అధికారులు
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మటన్ వ్యాపారస్తులు బరితెగించారు. “మా దందా మా ఇష్టం… మమ్మల్ని అడిగేవారే లేరు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సామాన్య ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. చచ్చిన మేకలు, గొర్రెలనే కోసి అమ్ముతాం.. ఐతే ఏంటని, చచ్చిన మాంసం తిని ఎవరూ చనిపోలేదు కదా అంటూ బహిరంగంగానే వ్యంగ్యంగా మాట్లాడుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అధికారుల అనుమతులు మాకెందుకు అంటూ కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. నెలనెలా ఎవరికి ఇవ్వాల్సిన మామూళ్లు వారికి ఇస్తున్నామని, అందుకే అధికారులు తమ జోలికి రారంటూ మార్కెట్‌లో బహిరంగంగా చర్చించుకోవడం వెనుక మున్సిపాలిటీ, పశుసంవర్ధక, ఆహార భద్రతా శాఖల అధికారుల పాత్ర ఎంత ఉందో స్పష్టమవుతోంది.
నిబంధనలు సున్నా.. అంతా రోత!
ప్రతి మటన్ దుకాణదారుడు ఆహార భద్రత ప్రమాణాల సంస్థ   నుంచి లైసెన్స్, స్థానిక మున్సిపాలిటీ నుంచి వ్యాపార అనుమతి పత్రం (ట్రేడ్ లైసెన్స్), నిరాక్షేపణ పత్రం  ఖచ్చితంగా పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క దుకాణానికి ఇవి లేవని తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ నిబంధనల ప్రకారం అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన జీవాలను విక్రయించకూడదు. మున్సిపల్ కసాయిఖానాలోనే వాటిని వధించి, పశువైద్యుడు పరీక్షించాక వేసే అధికారిక ముద్ర ఉన్న మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కానీ ఇక్కడ లాభాలే ధ్యేయంగా రోడ్డు పక్కనే, ప్రజలకు కనిపించేలా జీవాలను కోస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దుకాణాలన్నీ ఈగలు, దోమలు, దుమ్ముతో నిండి రోతగా కనిపిస్తున్నాయి. మాంసానికి అద్దాల తెరలు (గ్లాస్ స్క్రీన్లు) అమర్చలేదు. వ్యర్థాలను, రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. కత్తులు, కోసే పలకలను (చాపింగ్ బోర్డులను) కడగడం లేదు. బతికి ఉన్న మేకను కోస్తే ఒక ధర, చచ్చిన దాన్ని కోస్తే మరో ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూకంలో మోసాలు చేస్తూ, బరువు పెరగడానికి మాంసంలో నీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇంతగా రెచ్చిపోతున్నా మున్సిపాలిటీ, పశుసంవర్ధక, ఆహార భద్రతా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే కఠిన చర్యలు: ప్ర‌సాద్‌, మ‌ణుగూరు మున్సిపల్ కమిషనర్
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా.. పట్టణంలోని మటన్ వ్యాపారస్తుల్లో ఒక్కరికి కూడా ట్రేడ్ లైసెన్స్, నిరాక్షేపణ పత్రాలు లేవని, అద్దాలు కూడా అమర్చలేదని అంగీకరించారు. ఇప్పటికే వ్యాపారస్తులందరినీ పిలిచి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పామని, నిబంధనలకు విరుద్ధంగా నడిపితే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపాలిటీ నుంచి అర్జీ రాలేదు : స‌ర‌స్వతీ, పశుసంవర్ధక శాఖ అధికారి
పశుసంవర్ధక శాఖ అధికారిని వివరణ కోరగా.. జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి మున్సిపాలిటీ శాఖ వారు తమకు లేఖ ద్వారా అర్జీ పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు తాము వచ్చి పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్న వాటికి ముద్ర వేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మున్సిపాలిటీ నుంచి తమకు ఎటువంటి అర్జీ రాలేదని ఆమె స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.