బాలలను బాధ్యతయుతంగా పరిరక్షించుకోవాలి
డీటీఎస్ మేజిస్ట్రేట్ రాజేంద్ర ప్రసాద్
కాకతీయ, అశ్వాపురం: బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల డీటీఎస్ మేజిస్ట్రేట్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బాల కార్మిక పోరాట దినోత్సవం సందర్భంగా స్థానిక ఇటుక బట్టీల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల హక్కుల చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, పని ప్రదేశాల్లో పిల్లలను పనికి పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పిల్లలను రక్షించడం అందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు అందుతున్న విద్యావసతుల గురించి ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ నాగరాజు, ఏఐడీ ఎన్జీవో ప్రతినిధులు, ఇటుక బట్టీల యజమానులు, కార్మిక కుటుంబాల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

