- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు
- మానుకోటలో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో క్లబ్ ముందంజలో ఉందని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దూది కట్ల సత్యం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథి ఎన్ వి హనుమంత రెడ్డి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా విచ్చేసి నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ ఆశయాలు సాధించిన విజయాలు సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు హాజరై ప్రసంగించారు. ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగం తప్పనిసరిగా తన చుట్టూ ఉన్న సమాజ సేవకు నియోగించాలని కోరారు మాధవ సేవ కంటే మానవసేవే గొప్పదని తెలిపారు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ మరియు రోటరీ ఫౌండేషన్ చైర్మన్ హనుమంత రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ అనేక దేశాలలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న అన్నారు పోలియో రహిత ప్రపంచంగా తయారు చేయడంలో రోటరీ పాత్ర లాగనీయమన్నారు.
అంతేకాకుండా నిరుక్షరాస్యత నిర్మూలనకు పర్యావరణ పరిరక్షణకు మహిళా సాధికారతకు ప్రపంచ శాంతికి రోటరీ కట్టుబడి ఉందని ఈ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా దూది కట్ల సత్యం కార్యదర్శిగా సంతన్ రామరాజు మరియు ట్రెజరర్ గా ముల్లంగి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రత్నాకర్ రావు మరియు కొండలరావు వైద్యనాథ్ చాప్టర్ ప్రెసిడెంట్ మాల నాగేశ్వరరావు జిల్లా నాయకులు వర్తుల సురేందర్ రెడ్డి బిక్కి వెంకటేశ్వర్లు దోర్నాల నగేష్ కుమార్ బొల్లం శ్రీనివాస్ కొడాలి నాగేంద్రరావు బోయినపల్లి సతీష్ రావు హత్య శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి మల్లాల రమేష్ ఫాస్ట్ ప్రెసిడెంట్ వేమిశెట్టి కిషోర్ జంగాల విజయ్ కుమార్ నాళ్ళ వీరన్న జంగాల మంగపతి రావు విజయ్ నరసింహారావు గుప్తా యువజన శివకుమార్ కట్ల వెంకన్న ఇమ్మడి కృష్ణమూర్తి తోడేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

