- 128.37 క్వింటాళ్ల కొరత గుర్తింపు.. డీలర్పై కేసు నమోదు
- ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు
కాకతీయ, కారేపల్లి: వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు నేతృత్వంలోని పౌరసరఫరాల శాఖ అధికారులు సీతారాంపురం రేషన్ దుకాణంలో 128 క్వింటాళ్లు 37 కిలోల బియ్యం వ్యత్యాసం గుర్తించారు. ఈ మేరకు రేషన్ డీలర్ ఈసం కృష్ణపై 6(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి, రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. ప్రజలకు రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా సమీప రేషన్ డీలర్ ఎట్టె నాగేశ్వరరావుకు ఆ దుకాణం తాత్కాలిక అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు హెచ్చరించారు. తనిఖీల్లో సివిల్ సప్లై రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

