డయల్–100కు బదులు 112
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
బాధితుల ఫిర్యాదులపై తక్షణ స్పందనకు ఆదేశం
కాకతీయ, గంభీరావుపేట : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు డయల్–100 స్థానంలో డయల్–112ను అమల్లోకి తీసుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బుధవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ వ్యవస్థను పరిశీలించారు.
డయల్–112పై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, బాధితుల ఫిర్యాదులపై జాప్యం లేకుండా స్పందించాలని ఎస్పీ ఆదేశించారు. రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ తనిఖీలో సీఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

