epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం
భారత్‌ దౌత్యంతో ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా అంగీకారం
చివరి నిమిషం వరకు కొనసాగిన ఉత్కంఠభరిత చర్చలు
ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనకు సభ్యదేశాల ఆమోదం
మారుతున్న ప్రపంచాన్ని పాత వ్యవస్థలు నడపలేవన్న మోదీ
గ్లోబల్‌ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని స్పష్టం
బ్రిక్స్‌ సదస్సు ముగింపు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ : భారత్‌ దౌత్య విజయం సాధించింది. పశ్చిమాసియా సంక్షోభంపై విభేదాలు ఉన్నప్పటికీ బ్రిక్స్‌ సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపాయి. అరబ్‌ దేశాలైన ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియాలు కూడా ఉమ్మడి ప్రకటనకు అంగీకరించడం విశేషంగా నిలిచింది. శనివారం జరిగిన బ్రిక్స్‌ కూటమి సమావేశంలో సభ్యదేశాల ఆమోదంతో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. బ్రిక్స్‌ కూటమి పూర్తిగా ఏకాభిప్రాయంతో పనిచేస్తుంది. ఏ ఒక్క సభ్యదేశం వ్యతిరేకించినా ఉమ్మడి ప్రకటన నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌, యూఏఈలు ప్రారంభంలో కఠిన వైఖరి అవలంబించడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే భారత్‌ తెరవెనుక జరిపిన వరుస చర్చలతో ప్రతిష్ఠంభన తొలగిపోయింది. పశ్చిమాసియా సంక్షోభంపై తీవ్ర విభేదాలు ఉన్న ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారత్‌ కీలక పాత్ర పోషించింది.
పాత వ్యవస్థలు ఇక పనికిరావు
బ్రిక్స్‌ సదస్సు ప్రారంభ సెషన్‌ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కరచాలనం చేస్తూ కనిపించారు. సదస్సు ముగింపు ప్రసంగంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతున్న ప్రపంచాన్ని పాతబడిపోయిన వ్యవస్థలు నడపలేవని స్పష్టం చేశారు. ప్రాతినిధ్యం, స్పందన, నియమ నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవస్థల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ప్రస్తుత వ్యవస్థలు అన్ని దేశాల ఆకాంక్షలను సమర్థంగా ప్రతిబింబించలేకపోతున్నాయని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మరింత సమానత్వం, పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు.
గ్లోబల్‌ సౌత్‌కు సమాన భాగస్వామ్యం
భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వాటిని నియంత్రించే నిబంధనల రూపకల్పనలో గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు సమాన భాగస్వామ్యం ఉండాలని బ్రిక్స్‌ దేశాలు నొక్కి చెప్పినట్లు మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్ణయాల ప్రక్రియకు దూరంగా ఉంచడం సరికాదని అన్నారు. నిర్ణయాలకు, వాటి ఫలితాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భాగస్వామ్యం, ఉమ్మడి కార్యాచరణ ద్వారానే పూడ్చగలమని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడంతో పాటు, అన్ని దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఉమ్మడి సంకల్పానికి దిశానిర్దేశం
శనివారం ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్‌ బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. డిక్లరేషన్‌లోని తీర్మానాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు సభ్యదేశాలన్నింటిపైనా ఉందని పేర్కొన్నారు. కూటమి దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలు, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ముందుకు సాగవచ్చని ఢిల్లీ డిక్లరేషన్‌ ద్వారా స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై విభిన్న అభిప్రాయాలు ఉన్న దేశాలు ఒకే ప్రకటనకు అంగీకరించడం బ్రిక్స్‌ వేదికపై భారత్‌ దౌత్యపరమైన ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.