epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు

గ‌తంలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ మొన్న ఎలా అధికారంలోకి వ‌చ్చింది?

కార్య‌క‌ర్త‌లారా అధైర్య‌ప‌డ‌కండి

ఓడిపోగానే కుంగిపోవద్దు, భవిష్యత్తు మనదే

బ‌రిగీసి కొట్లాడితే త‌ప్ప విజ‌యం సాధించ‌లేం

ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం

ఆయ‌న్ను ఉద్దేశించే ఈట‌ల కామెంట్స్ అంటూ ప్ర‌చారం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనచెప్పకొచ్చారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్న.. లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిచింది… అని ఈట‌ల అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. తాజాగా మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని ఈటల కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఈవీఎం మేనేజ్ చేసిందా ?

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టి మరీ గెలిచిది. గ‌తంలో కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో వచ్చిన ఓట్లు 3016, దుబ్బాక, మునుగోడులో డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరు. బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం. ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే.
కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధపడకండి. భవిష్యత్తు మనదే. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అంతా బాధ్యత తీసుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. గెలిస్తే బీజేపీ వాళ్ళు ఈవీఎంలను ఏదో చేశారని అంటు న్నారు. మరి జూబ్లీహిల్స్ లో ఈవీఎం మేనేజ్ చేశారా? దొంగఓట్లు నమోదు చేయించారా? తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు. మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు.
బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు..అని ఈట‌ల వ్యాఖ్యానించారు.

అభివృద్దితోనే ..

ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశావు, ఇక ముందు ఏం చేస్తావు? అని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. కులం మతం పునాదిమీద రాజకీయాలు శాశ్వతంగా నడవవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మాది ప్రజాస్వామిక పార్టీ అందుకే గుజరాత్ లో ఇన్నేళ్లుగా పాలన నడుస్తుంది. అభివృద్ధితో పాటు భారత ఆత్మగౌరవం నిలబెట్టడం వల్లనే బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం అగ్రభాగాన నిలబడింది. యాభై శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గంలో 25 ఏళ్ల మైథిలీ ఠాగూర్ విజయం సాధించింది అంటే అర్థం చేసుకోండి. అభివృద్ధి సంక్షేమం అందరికీ అందుతుంది తప్ప ఒక వర్గానికి కాదు… అని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.