epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు

సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు
96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం
800 మెగావాట్ల ప్లాంట్‌కు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
5 లక్షల ఉద్యోగులకు ప్రమాద బీమా
పేదల ప్రభుత్వానికి మద్దతు అవసరం
రామగుండం అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జే. అరుణ శ్రీ, డి. వేణు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులతో కలిసి రామగుండంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ డివిజన్లలో రూ.80 కోట్ల 52 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, టియూఎఫ్ఐడి ద్వారా రూ.88 కోట్ల 90 లక్షలతో అమలు చేయనున్న నీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణ పనులకు అలాగే ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఇండ్ల పంపిణీతో ప్రజలకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం రామగుండంలో పర్యటించిన ఆయన నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు అలాగే 494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ను మంజూరు చేశారు. బహిరంగ సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రజా అవసరాలే పాలనకు కేంద్రబిందువని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయడం ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు విడుదల చేస్తున్నామని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 96 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం, లక్షలాది కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలులో ఉందని వెల్లడించారు. రామగుండం అభివృద్ధికి కీలకంగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు క్యాబినెట్ ఆమోదం లభించిందని సింగరేణి పరిరక్షణకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

రామగుండానికి సంక్షేమ అభివృద్ధి హామీలు

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ అజెండా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ అమలులో ఉన్నాయని తొలి విడతలోనే రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. రామగుండంలో 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ చేశామని మరో 300 ఇండ్ల పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంత‌రం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి రూ.600 కోట్ల పనులకు నాంది పలికినట్టు తెలిపారు. రోడ్డు విస్తరణతో నష్టపోయే వారికి ఉపాధి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేసి 479 మందికి ప్రొసీడింగ్స్ అంద‌జేశామ‌ని స్ప‌ష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు, ఆలయాల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేస్తామని, జర్నలిస్టులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

రామగుండంలో పెండింగ్‌కు తెర, 1700 కుటుంబాలకు పట్టాలు

పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ 1,700కి పైగా నిరుపేద కుటుంబాలకు వివిధ పథకాల కింద ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మేడిపల్లిలో 212 కుటుంబాలు, జనగామలో 31 మంది ట్రాన్స్‌జెండర్లు, గోదావరిఖని వరద ప్రభావిత ప్రాంతాల్లోని 129 కుటుంబాలు, మారేడు పాకలో సింగరేణి భూ సమస్య పరిష్కరించి 162 కుటుంబాలకు, జీఓ 76 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతో పట్టాలు అందించడం జ‌రిగింద‌ని అలాగే 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు రెండు నెలల్లో గృహప్రవేశం చేసేలా డ్రైనేజీ సహా మౌలిక వసతులు కల్పిస్తామని నగర వ్యాప్తంగా 494 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించామని కలెక్టర్ తెలిపారు. రామగుండం అభివృద్ధి కోసం రూ.169 కోట్లతో త్రాగునీటి సరఫరా, సీవరేజ్ ప్లాంట్ల పనులకు శంకుస్థాపన జరిగిందని గత రెండేళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో రూ.562 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ అభివృద్ధి పథం మొదలైందన్నారు. 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ వంటి నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. మరో తహసిల్దార్ కార్యాలయం, జూనియర్ కళాశాల భవనం, జనరల్ ఆసుపత్రికి అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రామగుండంలో 50 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యాపార, వైద్య, పర్యాటక కేంద్రంగా రామగుండాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.