epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం
ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం
ప్రథమ చికిత్స పేరుతో ప్రాణాలపై ప్రయోగాలు
యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వినియోగం
ప్రైవేట్ ఆసుపత్రులతో కమీషన్ దందా
పేషెంట్‌పై 40 నుంచి 50 శాతం కమీషన్లు
పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ వైఫల్యం
కఠిన చర్యలు కోరుతున్న గ్రామస్థులు

కాకతీయ, చేర్యాల : పల్లెల్లో ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు ప్రొఫెషనల్ డాక్టర్ల మాదిరిగా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే. కానీ ఈ గుడ్డి నమ్మకమే ఇప్పుడు ప్రమాదంగా మారుతోంది. అవసరం లేకున్నా ఇంజక్షన్లు, సెలైన్లు, బలమైన యాంటీబయోటిక్స్ ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు ఆర్ఎంపీలు చిన్న క్లినిక్‌లను నర్సింగ్ హోమ్‌ల మాదిరిగా మార్చి బెడ్లు వేసి చికిత్స అందించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రైవేట్ ఆసుపత్రులతో కమిషన్ దందాలు

కొంతమంది ఆర్ఎంపీలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏజెంట్లుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగం చిన్నదే అయినా పెద్దదిగా చూపించి తమకు అనుబంధం ఉన్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అక్కడ అనవసర పరీక్షలు, చికిత్సల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పేషెంట్‌ను రిఫర్ చేస్తే 40 నుంచి 50 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను అడ్డం పెట్టుకుని ఈ దందా సాగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ఇవ్వాల్సిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్‌ను ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. రోగి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండానే బలమైన మందులు ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ రాయడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధమే అయినప్పటికీ ఆర్ఎంపీలు అవే పనులు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోంది.

పర్యవేక్షణలో వైఫల్యం

ఆరోగ్యశాఖ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేపట్టినా అవి తాత్కాలికంగానే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని క్లినిక్‌లు సీజ్ చేసినా కొద్ది రోజులకే మళ్లీ తెరుచుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకునూర్, రాంపూర్, కాశేగూడెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్చరించింది. అనుమతి లేకుండా వైద్యం చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. ఆర్ఎంపీ వ్యవస్థ నియంత్రణలో వైఫల్యం గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఇప్పటికైనా ఆరోగ్యశాఖ కఠిన చర్యలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.