epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మొక్కజొన్న కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలి
ఎకరాకు 26 క్వింటాళ్ల నిబంధనతో అన్యాయం
బస్తాల కొరత, లారీల రాకలో జాప్యం
అకాల వర్షాల ముప్పు.. తక్షణమే ఎగుమతులు చేపట్టాలి
సొంత నియోజకవర్గ రైతుల సమస్యలపై డిప్యూటీ సీఎం స్పందించాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
ఖమ్మం – బోనకల్ రహదారిపై రైతులతో క‌లిసి రాస్తారోకో

కాకతీయ, చింతకాని: ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్నను ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై నాగులవంచ వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ ఆందోళనతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం మొక్కుబడిగా కేంద్రాలను తెరిచి రైతులకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనల పేరుతో వేధింపులు

ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కానీ రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి సాధించారని గోపాలరావు వివరించారు. ప్రభుత్వం విధించిన ఈ నిబంధన వల్ల మిగిలిన సగం పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనను వెంటనే ఎత్తివేసి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాల కొరత తీవ్రంగా ఉందని, రైతులు తమ సొంత డబ్బులతో బస్తాలు కొనుక్కుంటున్నారని, ఇది వారిపై అదనపు భారం మోపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అకాల వర్షాల భయం.. అధికారుల జాప్యం

కాటా వేసిన మొక్కజొన్నలను తరలించడానికి లారీలు రావడం లేదని, దీనివల్ల 15 నుంచి 20 రోజులుగా పంట కల్లాల్లోనే మగ్గిపోతోందని రైతులు వాపోయారు. అధికారులను అడిగితే లారీలు దొరకడం లేదని సాకులు చెబుతున్నారని విమర్శించారు. ప్రస్తుత అకాల వర్షాల నేపథ్యంలో పంట తడిసిపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని, వెంటనే లారీలు తెప్పించి ఎగుమతులు చేపట్టాలని కోరారు. మధిర నియోజకవర్గంలోనే అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, ఇక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గ రైతుల సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు.

పోరాటం ఉధృతం చేస్తాం

డిప్యూటీ సీఎం వెంటనే జోక్యం చేసుకుని మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తోటకూర వెంకట నరసయ్య, మండల నాయకులు ఆలేటి రవి, బల్లి చిన్న వీరయ్య, మడిపల్లి కిరణ్ బాబు, ఆళ్ల మాధవరావు, రౌతు అప్పారావు, బండి నరేష్, ఓబన బోయిన అచ్చయ్య, గడ్డం కోటేశ్వరరావు, కూచిపూడి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.