epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మానని గాయాలు ప్రమాదాల‌కు సంకేతం..!

మానని గాయాలు ప్రమాదాల‌కు సంకేతం..!
డయాబెటిస్‌ రోగుల్లో రక్తనాళాల సమస్యలపై అప్రమత్తత అవసరం
కాళ్లకు రక్తప్రసరణ తగ్గితే పీఏడీ ముప్పు పొంచి ఉన్నట్లే
చిన్న గాయాలను నిర్లక్ష్యం చేస్తే పుండ్లుగా మారే ప్రమాదం
నడిచేటప్పుడు నొప్పి.. పాదాలు చల్లబడటం వంటివి ప్రధాన లక్షణాలు
ధూమపానం మానేయాలి.. చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి
ఆధునిక చికిత్సలతో కాలు కోల్పోయే పరిస్థితిని నివారించవచ్చు
ప్రతి నెలా మూడవ మంగళవారం కరీంనగర్‌లో ఓపీ సేవలు
యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జన్ డాక్టర్ డీ. ప్రభాకర్

కాకతీయ, కరీంనగర్: డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లకు రక్తప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) వేగంగా పెరుగుతోందని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ డీ. ప్రభాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ రక్తనాళాల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. పీఏడీ వల్ల కాళ్లు, పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా మారడం లేదా మూసుకుపోవడం జరుగుతుందని, దీని కారణంగా రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహ బాధితుల్లో చిన్న గాయాలే మానకుండా తీవ్రమైన పుండ్లుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. నరాల సమస్యల కారణంగా కొందరికి నొప్పి కూడా తెలియకపోవచ్చని, ఇది మరింత ప్రమాదకరమని వివరించారు.

లక్షణాలను గుర్తించి అప్రమత్తమవ్వాలి

నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, త్వరగా అలసిపోవడం, పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం వంటి లక్షణాలను తేలికగా తీసుకోవద్దని డాక్టర్ ప్రభాకర్ సూచించారు. మానని గాయాలు ఉండటం, కాళ్ల వేళ్లు నల్లబడటం వంటివి కనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని కోరారు. కాళ్ల రక్తపోటు పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి ఆధునిక పరీక్షల ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటిస్ రోగులు తమ రక్త చక్కెర స్థాయిలను నిరంతరం కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగతాగే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానాలని హితవు పలికారు. సకాలంలో స్పందిస్తే సాధారణ మందులతో లేదా యాంజియోప్లాస్టీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు.

క్రమం తప్పకుండా పాదాల పరిశీలన

రోజూ తమ పాదాలను నిశితంగా పరిశీలించుకోవడం డయాబెటిస్ రోగులకు అత్యంత కీలకమని డాక్టర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. చిన్నపాటి రాపిడి లేదా గాయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కోరారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్స అందుకోవడం వల్ల కాలు కోల్పోయే (అంప్యుటేషన్) దుస్థితిని నివారించవచ్చని భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లావాసుల సౌకర్యార్థం ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక యశోద మెడికల్ సెంటర్‌లో తన ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రతినిధులు నవీన్ చక్రవర్తి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.