బోనకల్లో ఘనంగా హిందూ సమ్మేళనం
హిందువులు కలిసికట్టుగా ముందుకు సాగాలి
: డాక్టర్ జీ. వీరభద్రం గురువు
కాకతీయ, బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్లో హిందూ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. విశిష్ట అతిథి డాక్టర్ జీ. వీరభద్రం గురువు మాట్లాడుతూ.. హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని, సంస్కృతీ పరిరక్షణలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ముఖ్య వక్త ఫణిభట్ల రాజేశ్వర శాస్త్రి ఇతిహాసాలలోని ధర్మ సందేశాలను వివరించగా, మహిళా వక్త వాణి మాతృశక్తి ప్రాధాన్యతను చాటిచెప్పారు. సభకు శాస్త్రి, ఉప సర్పంచ్ బానోతు కొండ సభాధ్యక్షులుగా వ్యవహరించగా, సర్పంచ్ బానోతు జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువతతో పాటు నిర్వాహకులు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం బోనకల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందించింది.

