epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లింగంపేటలో టేకు మాఫియా రాజ్యం!

లింగంపేటలో టేకు మాఫియా రాజ్యం!
మామూళ్ల మత్తులో ఫారెస్ట్ శాఖ..?
కొత్తకుంట ప్రాంతంలో య‌థేచ్ఛ‌గా చెట్ల న‌రికివేత‌
చేతులు ముడుచుకుని చూస్తున్న అధికారులు
సామాన్యులపై కేసులు.. మాఫియాకు మామూళ్లతో మినహాయింపా..?
వివరణకు దొరకని రేంజ్ ఆఫీసర్ ఖలీల్..!

కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామ పరిధిలోని కొత్తకుంట ప్రాంతం ప్రస్తుతం టేకు మాఫియాకు స్వర్గధామంగా మారింది. కోట్ల రూపాయల విలువైన టేకు చెట్లను రాత్రింబవళ్లు విచ్చలవిడిగా నరికి తరలిస్తున్నా, ఫారెస్ట్ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అడవిని కాపాడాల్సిన అటవీ శాఖే అక్రమార్కులకు అండగా నిలుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “మామూళ్లు ముట్టితే అడవిని కూడా అమ్మేస్తారా?” అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకుంట ప్రాంతంలో భారీ సంఖ్యలో టేకు వృక్షాలు నేలమట్టమవుతున్నా, ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ దందా రోజురోజుకూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా.. కేసులు నమోదు చేయకపోవడం, రవాణా వాహనాలను పట్టుకోకపోవడం అధికారుల అంతర్గత సహకారానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.

సామాన్యుడికో న్యాయం.. మాఫియాకో న్యాయమా?
పర్యావరణ పరిరక్షణ పేరుతో చిన్నపాటి తప్పులకే గ్రామస్తులపై కేసులు పెట్టే అధికారులు.. ఇప్పుడు అడవిని ముక్కలుగా కోసి అమ్ముకుంటున్న మాఫియా ముందు ఎందుకు మోకరిల్లారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “సామాన్యుడైతే చట్టాలు.. మాఫియాకైతే మామూళ్లతో మినహాయింపా?” అంటూ స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లింగంపేట కొత్తకుంట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ టేకు దందాపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్ల నరికివేతకు పాల్పడుతున్న స్మగ్లర్లతో పాటు, వారికి పరోక్షంగా సహకరిస్తున్న ఫారెస్ట్ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అడవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరణకు దొరకని రేంజ్ ఆఫీసర్ ఖలీల్..!
లింగంపేట కొత్తకుంట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ టేకు నరికివేత వ్యవహారంపై వివరణ కోరుతూ ‘కాకతీయ’ ప్రతినిధి వేములవాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలీల్‌ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే పలుమార్లు కాల్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. అడవుల్లో జరుగుతున్న అక్రమ టేకు దందాపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో, బాధ్యత కలిగిన అధికారి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. “అడవిని కాపాడాల్సిన అధికారులు ఫోన్‌కే స్పందించకపోతే.. ఇక అక్రమ దందాలను ఎలా అరికడతారు?” అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.