సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడిగా మైబు సింగ్ రాథోడ్
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం
కాకతీయ,చెన్నారావుపేట : గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే చెన్నరావుపేట మండల సర్పంచుల ఫోరమ్కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా చెరువు కొమ్ము తండా సర్పంచ్ భూక్య మైబు సింగ్ రాథోడ్ ఎన్నికయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మైబు సింగ్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచుల ఫోరమ్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా మైధం రాకేష్, ప్రధాన కార్యదర్శిగా కుసుమ సతీష్, కోశాధికారిగా బుర్ర సుదర్శన్ గౌడ్, కార్యదర్శిగా మాలోత్ రాంచందర్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా అనిత రాంబాబు, కంది శ్వేత, కృష్ణచైతన్య రెడ్డి, కన్వీనర్లుగా గూడ సంధ్య మహేందర్, లావుడ్యా తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా కనకమల్లు, బొడ రవి, లావుడ్యా చందు, దారావత్ రమేష్లను ఎన్నుకున్నారు.ఈ
కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు మొగిలి వెంకట్రెడ్డి, తప్పేట రమేష్, జిల్లా కార్యదర్శి కంది చైతన్యరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, ఉపసర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు బండి హరీష్తో పాటు సర్పంచులు ఉమామోహన్ నాయక్, దారా రంజిత్, లావణ్య, హనుమ నాయక్, బద్రి ఇర్యా నాయక్, పీరి పత్నీ, విక్రమ్, బాలు నాయక్, వీరాసింగ్, శారద, జ్యోతి, వెంకన్న, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

