రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్
రైతుభరోసా నిధుల జమపై ఏటూరునాగారంలో సంబరాలు
సీఎం రేవంత్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయంపై హర్షం
కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేయడంపై ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో నూతన విశ్వాసాన్ని నింపుతున్నాయని అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పాలనకు నిదర్శనమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, ములుగు ఆత్మ చైర్మన్ చిటమట రఘు, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ కర్ల అరుణ, ఆర్టీసీ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, శివాలయం చైర్మన్ మడుగురి ప్రసాద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, సర్పంచ్ గద్దల నవీన్, వావిలాల చిన్న ఎల్లయ్య, సర్వ అక్షిత్, ఠాగూర్, తాజ్, నరసింహ రావు, సరికోపుల శ్రీనివాస్, గంపల శివ, పడిదల హనుమంత్, లక్కీ, తరుణ్, రమేష్, సిరాజ్, ఖలీల్ ఖాన్, సాంబశివరావు, గికురు భాగ్య, రాధిక, ఉదయ్, మంజుల, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

