epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!

రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!
ఉక్రెయిన్ యుద్ధంలో 26 మంది మృతి
ఏడుగురు గల్లంతు… 50 మంది విడుదల కోసం ప్రయత్నాలు
119 మందిని స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్రం
విదేశాంగ శాఖ వెల్లడి

కాకతీయ, నేషనల్ డెస్క్ : రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన యుద్ధంగా భావిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 202 మంది భారతీయులు రష్యన్ సాయుధ దళాలలోకి నియమించబడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 26 మంది భారతీయులు మరణించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు రష్యా అధికారులు నివేదించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వివరాలను ఎంపీలు సాకేత్ గోఖలే, రణదీప్ సింగ్ సుర్జేవాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సమిష్టి దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పటివరకు 119 మంది భారతీయులను ముందస్తుగా విడుదల చేయించగలిగామని, మిగిలిన 50 మంది భారతీయుల విడుదల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మరుసటి రోజైన డిసెంబర్ 17న ఈ సమాధానం ఇవ్వడం గమనార్హం.

యుద్ధ ప్రాంతాలకు వెళ్లొద్దన్న హెచ్చరిక
భారతీయులను ప్రలోభపెట్టి లేదా మోసపూరిత మార్గాల్లో రష్యా సైన్యంలో చేర్చి యుద్ధరంగానికి పంపుతున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే రష్యా–ఉక్రెయిన్ వివాదానికి దూరంగా ఉండాలని భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. జనవరిలో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం, అప్పటివరకు కనీసం 12 మంది భారతీయులు మృతి చెందగా, 16 మంది గల్లంతయ్యారు. ఆగస్టు 2024లో రష్యన్ సాయుధ దళాలలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయులు మరణించినట్లు కేంద్రం తెలిపింది.

ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. ఉక్రెయిన్ నాటో (NATO)లో చేరేందుకు ప్రయత్నించడమే ఈ యుద్ధానికి కారణమని రష్యా పేర్కొంటూ తన పొరుగుదేశంపై దాడికి దిగింది.
అక్టోబర్‌లో గుజరాత్‌కు చెందిన మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ కేవలం మూడు రోజుల పాటు ఫ్రంట్‌లైన్‌లో ఉన్న తర్వాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. స్టడీ వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్టు చేసి ఏడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. జైలు శిక్ష అనుభవించేందుకు ఇష్టపడక, “ప్రత్యేక సైనిక ఆపరేషన్”లో పాల్గొనే ఒప్పందంపై అతడు సంతకం చేసినట్లు వెల్లడైంది. ఇటీవలి మరణాల్లో రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల అజయ్ గొడారా కూడా ఉన్నారు. విద్యార్థి వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని బలవంతంగా సైన్యంలో చేర్చారని, సెప్టెంబర్ 2025లో నెట్స్క్‌లోని సెలిడోవ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో అతడు మరణించినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.