epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల బియ్యం గల్లంతు

పేదల బియ్యం గల్లంతు
కరీంనగర్ జిల్లాలో భారీ సీఏంఆర్ స్కామ్
35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్
ప్రభుత్వానికి రూ.124 కోట్లకుపైగా నష్టం
ఏళ్లుగా డిఫాల్టర్లపై చర్యలే లేవు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం భారీగా మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) పేరుతో ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం ఏళ్ల తరబడి మిల్లుల వద్దే నిలిచిపోవడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం వేల మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదవుతున్నా, సంబంధిత మిల్లులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, అండదండలే కారణమన్న విమర్శలు బలపడుతున్నాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యం దారి మళ్లుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

2012 నుంచే మొదలైన బకాయిలు

కరీంనగర్ జిల్లా రేషన్ వ్యవస్థలో సీఏంఆర్ డిఫాల్ట్ సమస్య కొత్తది కాదని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. 2012–13 ఖరీఫ్ నుంచే బకాయిలు మొదలై 2024 వరకు కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 ఖరీఫ్‌లో 2,589.866 మెట్రిక్ టన్నులు, 2013–14 రబీ సీజన్‌లో 35.316 మెట్రిక్ టన్నులు, 2014–15 ఖరీఫ్‌లో 178.782 మెట్రిక్ టన్నులు డిఫాల్ట్‌గా నమోదయ్యాయి.
తర్వాత కొంత విరామం అనంతరం 2021–22 ఖరీఫ్‌లో 4,106.105 మెట్రిక్ టన్నులు, 2022–23 రబీ సీజన్‌లో ఏకంగా 20,115.377 మెట్రిక్ టన్నులు, 2023–24 ఖరీఫ్‌లో మరో 8,507.130 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

19 మిల్లులు.. 22 డిఫాల్ట్ ఎంట్రీలు

జిల్లాలో మొత్తం 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా నమోదైనట్లు అధికారిక జాబితా చెబుతోంది. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 22 డిఫాల్ట్ ఎంట్రీలతో ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ బియ్యం 35,563.576 మెట్రిక్ టన్నులుగా తేలింది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.137 కోట్లుగా ఉండగా, కనీసం రూ.124 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ మొత్తంలో బియ్యం గల్లంతు కావడం రేషన్ వ్యవస్థ పర్యవేక్షణపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.

నామమాత్రపు కేసులకే పరిమితమైన చర్యలు

ఇంత భారీ స్థాయిలో డిఫాల్ట్‌లు నమోదవుతున్నా అధికారుల చర్యలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లులపై రికవరీ చర్యలు, లైసెన్సుల రద్దు, కఠిన శిక్షలు వంటి చర్యలు ఎక్కడా కనిపించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నామమాత్రపు కేసులు నమోదు చేసి వ్యవహారాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నా బాధ్యత వహించాల్సిన శాఖలు మౌనంగా ఉండటం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే రేషన్ వ్యవస్థలో డిఫాల్ట్‌లు మరింత పెరిగే ప్రమాదం ఉందని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.