epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక దొంగ‌లు

ఇసుక దొంగ‌లు

శంకరపట్నం మండలంలో ఇష్టారాజ్యంగా దందా
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ర‌వాణా
ఉదయం 4 గంటల నుంచే తరలింపు
నిత్యం 200కుపైగా ట్రాక్టర్లలో తరలుతున్న వైనం
మైనర్లే డ్రైవర్లు.. సిండికేట్‌గా మాఫియా
నిద్రావ‌స్థ‌లో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు

కాకతీయ, శంకరపట్నం : మండలంలో ఇసుక అక్రమ దందా రోజురోజుకూ రెచ్చిపోతూ బహిరంగ సిండికేట్ వ్యవస్థగా మారింది. కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి ఏర్పాటు చేసిన సిండికేట్, ప్రభుత్వ ఇందీరమ్మ ఇండ్ల పేరును కవచంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి తరలిస్తూ లక్షలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ దందాకు ప్రధాన బలమైందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీణవంక మండల పరిధిలోని చల్లూరు ఇసుక రీచ్‌ నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే తవ్వకాలు ఉదయం 9 గంటల వరకు నిరవధికంగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమని చెప్పుకుంటూ ట్రాక్టర్లలో ఇసుకను తరలించడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా వెనుక ఎవరి అండ ఉందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రోజువారీగా భారీ ఎత్తున ఇసుక తరలింపులు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మైనర్లతో డ్రైవింగ్…

శంకరపట్నం మండలంలో ఇసుక రవాణాలో నిబంధనలు పూర్తిగా కనుమరుగైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమయ్యే ఈ అక్రమ ర‌వాణా చల్లూరు ఇసుక రీచ్‌కే పరిమితం కాకుండా మండల పరిధిలోని నదుల నుంచి కూడా యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 200 నుంచి 300 వరకు ట్రాక్టర్లలో భారీ ఎత్తున ఇసుక తరలింపు జరుగుతుండటం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాను గుర్తించకుండా ఉండేందుకు ట్రాక్టర్లపై నెంబర్ ప్లేట్లు లేకుండా లేదా నెంబర్‌లు స్పష్టంగా కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అధిక శాతం మైనర్ బాలురే నడుపుతున్నారనే విషయం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

మామూళ్ల మత్తులో అధికారులు!

శంకరపట్నం మండలంలో నిత్యం వందలాది ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక బహిరంగంగా తరలుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లముందే దందా సాగుతున్నా నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వెనుక కారణాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక సిండికేట్ నుంచి నెలవారీగా అందుతున్న మామూళ్లే అధికారుల మౌనానికి కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.