epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల ముంగిటకే పోలీసింగ్

ప్రజల ముంగిటకే పోలీసింగ్
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంది
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి
అరైవ్ అలైవ్‌లో డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
రుద్రంగిలో ‘ఆధునిక’ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన!
రూ.2.50 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మాణానికి శ్రీకారం
వేములవాడకు ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు మంజూరు చేయాలి
డీజీపికి విజ్ఞ‌ప్తి చేసిన ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్
నేరాల నియంత్రణలో కెమెరాలదే కీలక పాత్ర : ఎస్పీ మహేష్ గితే

కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శుక్రవారం రాష్ట్ర డీజీపీ బీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. సుమారు ఎకరం స్థలంలో కార్పొరేట్ తరహా హంగులతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిజం అంతమైందని, ఇకపై పౌర కేంద్రిత పోలీసింగ్‌పైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. “హత్యలు, ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ కుటుంబాల కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి” అని ఆయన కోరారు. ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడిని చైతన్యపరుస్తామన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం దృష్ట్యా అక్కడ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డిది శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయం: విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతల పరిరక్షణకు, డ్రగ్స్ నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. “తాను కోరిన వెంటనే రుద్రంగికి పోలీస్ స్టేషన్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించి పనులు శరవేగంగా చేయిస్తున్నాం” అని పేర్కొన్నారు. భీమారంలోనూ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆయన కోరారు.

భద్రతలో సాంకేతికతకు ప్రాధాన్యం

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, ఎన్నికలు మరియు జాతరలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం కృషి గొప్పదని కొనియాడారు. ఎస్పీ మహేష్ గితే మాట్లాడుతూ.. రుద్రంగిలో నేరాల నియంత్రణ కోసం ఇప్పటికే అత్యాధునిక ఏఎన్‌పీఆర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నూతన భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు సేవలు మరింత వేగవంతమవుతాయని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాభాయ్, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.