రసాయనాల వినియోగంలో విచక్షణ అవసరం
మోతాదు మించితే భూసారం దెబ్బతింటుంది
గన్నారంలో శాస్త్రవేత్త డాక్టర్ గోన్లా నాయక్ అవగాహన
కాకతీయ, రాయపర్తి: వ్యవసాయంలో రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం వల్ల సాగు సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్లా నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని గన్నారం గ్రామంలో ఏఓ గుమ్మడి వీరభద్రం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సాగు మెళకువలపై అవగాహన కల్పించారు. గోన్లా నాయక్ మాట్లాడుతూ.. పంట సాగులో మోతాదుకు మించి రసాయనాలు వాడటం వల్ల భూమిలోని మిత్ర పురుగులు నశించి, శత్రు పురుగులు బలపడతాయని తెలిపారు. దీనివల్ల నేల నిస్సారమై దిగుబడులు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రైతు మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించుకోవాలని, రసాయనాలపై ఆధారపడటం తగ్గించి పచ్చిరొట్ట ఎరువుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఏఓ వీరభద్రం మాట్లాడుతూ.. పంట కోతల అనంతరం వరి, మొక్కజొన్న కొయ్యలను కాల్చవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రోటవేటర్, మల్చర్ వంటి యంత్రాలతో వాటిని భూమిలో కలియదున్నడం వల్ల అవి సేంద్రియ ఎరువుగా మారి తదుపరి పంటకు మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం విజయ సమ్మయ్య,

