తుషార హై స్కూల్లో నూరు శాతం ఫలితాలు
పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత
574 మార్కులతో ప్రథమ స్థానంలో పి. లాస్య
విజేతలను అభినందించిన యాజమాన్యం
కాకతీయ, హన్మకొండ : పదో తరగతి ఫలితాల్లో హనుమకొండలోని తుషార హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ విజయం సాధించడంపై పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాల్లో పి. లాస్య 574 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, పి. అనిరుధ్ 573 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల సరైన దిశానిర్దేశం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఈ విజయానికి మార్గదర్శకులుగా నిలిచిన తుషార స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డా. పి. రమేష్ బాబు, ప్రిన్సిపాల్ మేజర్ వి. నరేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎం. సుమలను మరియు అంకితభావంతో బోధించిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రుల సహకారం, గురువుల బోధన కలిసి పాఠశాల కీర్తిని మరోస్థాయికి తీసుకెళ్లాయని యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇదే పట్టుదలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


