epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టెన్త్ ఫ‌లితాల్లో జిల్లా ప్రతిభ గర్వకారణం

టెన్త్ ఫ‌లితాల్లో జిల్లా ప్రతిభ గర్వకారణం
ములుగు అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక అధికారి నియామకం
అటవీ ప్రాంత గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : అధికారుల సమన్వయంతో ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డి.ఎఫ్.ఓ వికాస్ మీనాలతో కలిసి జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి శాలువాలతో సన్మానించారు. అక్షరమాలలో ములుగు జిల్లాను వెలిగించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజా దర్బార్ ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని, ఇందులో భాగంగా ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసం త్వరలోనే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన గ్రామపంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు భవనాల మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అటవీ గ్రామాల్లో సౌకర్యాల కల్పన

అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పన విషయంలో అటవీ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురిచేయవద్దని, దీనిపై త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతరించిపోయే వృక్షజాతులు, పండ్ల మొక్కలతో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేయాలని, ఇప్ప చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మేడారం జాతరలో అద్భుతంగా పనిచేసిన మహిళా సంఘాలు అదే స్ఫూర్తితో గోదావరి పుష్కరాల్లోనూ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, వారికి డి.ఆర్.డి.ఏ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీవో వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.