ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా గుడిమళ్ల
హన్మకొండ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక
హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం
ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యం..
రూ.5 వేల పెన్షన్ అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్
: గుడిమళ్ల రవికుమార్
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర చైర్మన్గా గుడిమళ్ళ రవికుమార్ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర వేదిక ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ కోసం దశల వారీగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన గుడిమళ్ళ రవికుమార్ సేవలను గుర్తించి రాష్ట్ర చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంస్థను మరింత బలోపేతం చేసి ఉద్యమకారుల హక్కుల సాధనకు కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు గుర్తింపు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ప్రకటించారు. కమిటీలో మొత్తం 20 మంది సభ్యులకు స్థానం కల్పించారు. అందులో సుందేళ్ళ సునీల్, శ్యామ్ కృష్ణ, రమేష్, ఎండి చాంద్ పాషా, అశోక్, రాజు, మనోహర్, ఇమాడిశెట్టి రాజు తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఉద్యమకారులకు రూ.5 వేల పెన్షన్ డిమాండ్
సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రతి ఒక్కరికి నెలకు రూ.5,000 పెన్షన్, ఆరోగ్య బీమా, ఉచిత బస్ ప్రయాణం, 250 గజాల ఇంటి స్థలం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం అందించాలని సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు గుడిమళ్ళ రవికుమార్ వెల్లడించారు.

