epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైస్ మిల్లర్ల మాయాజాలం

రైస్ మిల్లర్ల మాయాజాలం
ఉమ్మడి కరీంనగర్‌లో రూ.609 కోట్ల అక్రమాలు
నిబంధనలను తుంగలో తొక్కి రీ-పాలిషింగ్ దందా
అనుమతులు రద్దయినా ఆగని బియ్యం తరలింపు
పాత బియ్యానికి కొత్త రూపం.. రూ.100 కోట్ల లాభమే లక్ష్యం
ఈడీ ఎంట్రీతో ఉలిక్కిపడుతున్న మిల్లర్లు
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం పెద్ద ఎత్తున అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోట్ల రూపాయల విలువైన బియ్యం పక్కదారి పట్టడం, అనుమతులు లేకున్నా రీ-పాలిషింగ్ దందా కొనసాగుతుండటంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,235 కోట్ల సీఎంఆర్ అక్రమాలపై ఈడీ దర్యాప్తునకు ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో, స్థానికంగా ఉన్న రైస్ మిల్లర్లలో గుబులు మొదలైంది.

రూ.609 కోట్ల బకాయిలు.. కేసుల పరంపర
సీఎంఆర్ బియ్యం కేటాయింపుల్లో మిల్లర్ల అక్రమాలు తారస్థాయికి చేరాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూ.182 కోట్లు, జగిత్యాల రూ.140 కోట్లు, రాజన్న సిరిసిల్ల రూ.69 కోట్లు, పెద్దపల్లి రూ.218 కోట్ల చొప్పున మొత్తం రూ.609 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఒకరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. దాదాపు 38 మిల్లులను డిఫాల్టర్లుగా గుర్తించగా, మరో 20 మిల్లులపై విచారణ కొనసాగుతోంది. ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా, బకాయిలు రికవరీ కావడం లేదని సమాచారం.

అనుమతులు రద్దయినా ఆగని అక్రమ రీ-పాలిషింగ్
వేలంలో దక్కించుకున్న 56,500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని రీ-పాలిషింగ్ చేసేందుకు ఒక ప్రముఖ రైస్ మిల్లర్ కలెక్టర్ వద్ద అనుమతులు పొందారు. అయితే, ఆ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడంతో 11 రైస్ మిల్లుల అనుమతులను కలెక్టర్ రద్దు చేశారు. అయినా కూడా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, ఆ మిల్లర్ గోదాముల నుంచి బియ్యాన్ని లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. తన సొంత మిల్లులతో పాటు, బినామీ మిల్లుల్లో రీ-పాలిషింగ్ కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా నిల్వ ఉన్న నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని ఇథనాల్ లేదా పశుగ్రాసం కోసం మాత్రమే వాడాల్సి ఉండగా, దాన్ని పలుమార్లు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. క్వింటాలుకు రూ.2,170కి కొన్న బియ్యాన్ని, రూ.3,500 కంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఈ దందా ద్వారా రూ.100 కోట్ల లాభం గడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈడీ దర్యాప్తుతో కలకలం
ఆహార భద్రత ప్రమాణాలను తుంగలో తొక్కి, నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలకు అంటగడుతున్న ఈ మిల్లర్ల మాయాజాలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,235 కోట్ల సీఎంఆర్ స్కాంపై ఈడీ రంగంలోకి దిగితే, బియ్యం వేలాలు, బినామీ లావాదేవీలు, రాజకీయ అండదండల వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో జిల్లాలోని అక్రమ మిల్లర్లలో వణుకు మొదలైంది. అధికారులు పౌరసరఫరాల శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.