మోదీ విధానాలను ప్రతిఘటించాలి
యువత హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం
నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయంపై ఉద్యమాలు
ప్రశ్నించడం, నిరసించడం యువత ప్రజాస్వామ్య హక్కులు
యువతను అణచివేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు
ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలి
యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్
కాకతీయ, ఖమ్మం టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ పిలుపునిచ్చారు. యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం, యువత హక్కులపై అవగాహన కల్పించడం యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

యువత గొంతును అణచలేరు
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదని, ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువతకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులని సాయికుమార్ అన్నారు. దేశ యువత గొంతుకను అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హింస, బెదిరింపులు, అణచివేతతో యువత హక్కులను కాలరాయడం సాధ్యం కాదన్నారు. నిరుద్యోగం నిర్మూలన, విద్యారంగ అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలానికి యువత భయపడదని, నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. యువతను భయపెట్టలేరని, అణచలేరని స్పష్టం చేశారు.
ప్రజలకు అన్నదానం
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో సాయికుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు కొత్త సీతారాములు, శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా జనరల్ సెక్రటరీలు కిల్లర్ అనిల్, గంగరాజు, బచ్చలకూర నాగరాజు, గాదెల ఝాన్సీ, బామ్మిడి శ్రీనివాస్, రంగా జనార్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షాహెల జావిద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ అంజన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్, జిల్లా జనరల్ సెక్రటరీలు బెల్లంకొండ శరత్, కుక్కల మహేష్, అన్వేష్ గౌడ్, నెల్లూరి ఉపేందర్, బాలరాజ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లం సాయి తేజ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు అంబటి ఈశ్వర్, జంగం రాజేష్, నితీష్ కుమార్, కైసర్, ఆకాష్ నాయుడు, సాయి తేజ, ఖమ్మం టౌన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, టౌన్ ఉపాధ్యక్షులు సైదన్ రావు, సంపత్ నాయుడు, మండల అధ్యక్షులు రామకృష్ణ, నిమ్మల నాగేశ్వరావు, సతీష్, ముత్తారావు, యువజన కాంగ్రెస్ నాయకులు బోడిపూడి రాజా, పంది రాజు, దేవరకొండ రాజీవ్ గాంధీ, సాయి కుమార్, తోట నరేష్ తదితరులు పాల్గొన్నారు.

