epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి

చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి
విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బైండ్ల సమాజం ముందుకు సాగాలి
పిల్లల చదువును మధ్యలో ఆపొద్దు.. ఉన్నత విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి
బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎంను కోరాం
‘పే బ్యాక్‌ టు సొసైటీ’ స్ఫూర్తితో సేవ చేయాలి
బీఈఏటీని బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా సమాజాన్ని ఏకతాటిపైకి తేవాలి
వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య

కాకతీయ, హైదరాబాద్‌ : బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు సాగాలని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం విజన్‌ మీట్‌–2026 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ఈ మేరకు మాట్లాడారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను పార్లమెంట్‌ వరకు చేరడానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులే కారణమని డా. కడియం కావ్య తెలిపారు. కులవృత్తి ద్వారా ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువును మధ్యలోనే నిలిపివేయవద్దని, ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పిల్లలను ఉన్నతంగా చదివించి జీవితంలో స్థిరపడేలా సహకరించాలన్నారు.

బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు

బైండ్ల భవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఈఏటీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను సంఘంలో భాగస్వాములను చేయాలని డా. కడియం కావ్య కోరారు. గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా సంఘం కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసి సభ్యత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ స్ఫూర్తిని అలవర్చుకుని సమాజానికి తిరిగి సేవ చేయాలని అన్నారు. నిజాయితీ, తెలివితేటలు, ప్రజాబలమే తమ పెట్టుబడులని ఎంపీ పేర్కొన్నారు. రాజకీయ హోదాలు ఉన్నా లేకపోయినా సమాజానికి తన సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తూ సమాజంలో పరస్పర అనుబంధాలను పెంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఈఏటీ అధ్యక్షుడు చినపాక స్వామి, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్‌మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి రూ.15 వేల కోట్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.