epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.200 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.200 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?
టెసరాక్ట్ కంపెనీకి చైర్మ‌న్‌గా సీఎం సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి
ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి ఏ లెక్క‌న భూ కేటాయింపులు
కర్ణాటకలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా?
నిజాలు నిగ్గు తేల్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాటం సాగుతుంది
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే టెసరాక్ట్‌ కంపెనీకి కేటాయించారని, ఆ సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, రూ.లక్ష మూలధనం ఉన్న కంపెనీకి ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఏ ప్రాతిపదికన కేటాయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమి విలువ రూ.200 కోట్లు ఉంటే.. కేవలం రూ.7 కోట్లకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి భూమి కేటాయింపు వ్యవహారంపై బీజేపీ ఫిర్యాదు చేసి.. లోకాయుక్త విచారణ వరకు తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘కర్ణాటకలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా?’’ అని నిలదీశారు. టెసరాక్ట్‌ కంపెనీకి, సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారని ప్రస్తావించిన కేటీఆర్‌.. కొండల్‌రెడ్డి తన ప్రొఫైల్‌లోనే టెసరాక్ట్‌ చైర్మన్‌గా పేర్కొన్నారని అన్నారు. ఈ భూకేటాయింపు వ్యవహారంలోని నిజానిజాలు తేలే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

టెసరాక్ట్‌ ఎవరిది?

టెసరాక్ట్‌ కంపెనీ వ్యవహారంపై తాము ఆరా తీసినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఆ సంస్థ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరికరాల తయారీలో ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు. అమెరికా ఎంబసీ ప్రతినిధులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించిందని, యూఎస్‌–ఇండియా స్ట్రాటెజిక్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో కొండల్‌రెడ్డికి సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. కొండల్‌రెడ్డి తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో టెసరాక్ట్‌ కంపెనీకి చైర్మన్‌గా పేర్కొన్నారని కేటీఆర్‌ అన్నారు. అమెరికా కాన్సులేట్‌ కూడా కొండల్‌రెడ్డి టెసరాక్ట్‌ చైర్మన్‌ అని పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థకు, సీఎం కుటుంబానికి ఉన్న సంబంధాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టెసరాక్ట్‌ కంపెనీకి సంబంధించిన పలు వివరాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. 2025 మార్చి 31న కంపెనీ చేసిన ప్రకటనలో తమ సంస్థలో ఒక్క ఉద్యోగి కూడా లేరని పేర్కొన్నట్లు తెలిపారు. కంపెనీ మూలధనం కేవలం రూ.లక్ష మాత్రమేనని అన్నారు. అలాంటి సంస్థకు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకు కేటాయించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. భూమి కేటాయింపునకు ముందు సంస్థ ఆర్థిక సామర్థ్యం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించిందా? భూమి కేటాయింపునకు అనుసరించిన విధానమేంటి? అన్న వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు.

కుటుంబ సభ్యుల చుట్టూ కాంట్రాక్టులు, భూములా?

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇతర వ్యవహారాలను కూడా కేటీఆర్‌ ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి మరో సోదరుడు అనుముల జగదీశ్‌రెడ్డి అమెరికాలో ఉంటారని.. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా ‘స్వచ్ఛ్‌ బయో’ అనే సంస్థతో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఆ సంస్థకు ఎక్కడ భూములు కేటాయించారో తవ్వి తీస్తామని అన్నారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి రూ.1,137 కోట్ల అమృత్‌ కాంట్రాక్టు దక్కిందని కేటీఆర్‌ ఆరోపించారు. సింగరేణిలోనూ ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగుతున్నాయని విమర్శించారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్లు, ఇతర కుంభకోణాలకు సంబంధించిన అంశాలను గతంలో బీఆర్‌ఎస్‌ బయటపెట్టిందని.. ఆ పరంపరలోనే టెసరాక్ట్‌ భూకేటాయింపు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.

‘‘కర్ణాటకలో ఒక న్యాయం.. ఇక్కడ మరో న్యాయమా?’’

కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై బీజేపీ ఫిర్యాదు చేసిందని కేటీఆర్‌ తెలిపారు. ఆ వ్యవహారం లోకాయుక్త విచారణకు వెళ్లి.. చివరకు సిద్ధరామయ్య రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. అలాంటప్పుడు తెలంగాణలో సీఎం సోదరుడితో సంబంధం ఉందని తాము ఆరోపిస్తున్న కంపెనీకి భారీ విలువైన ప్రభుత్వ భూమి కేటాయిస్తే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ‘‘పక్క రాష్ట్రంలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా?’’ అని ప్రశ్నించారు. టెసరాక్ట్‌ కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారని కేటీఆర్‌ అన్నారు. అయితే కంపెనీ చైర్మన్‌గా కొండల్‌రెడ్డి తన ప్రొఫైల్‌లోనే పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ వ్యవహారం మంత్రి శాఖ పరిధిలోనే జరిగిందా? మంత్రికి పూర్తి సమాచారం ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైతే ప్రభుత్వ భూములు, కాంట్రాక్టులు పొందేందుకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయా? అని కేటీఆర్‌ నిలదీశారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ‘‘టెసరాక్ట్‌ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టం. భూకేటాయింపులో ఎవరి పాత్ర ఉంది? ఏ ప్రాతిపదికన భూమి ఇచ్చారు? సంస్థ సామర్థ్యాన్ని ఎలా నిర్ధారించారు? అన్నది తేలాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. అయితే కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం, టెసరాక్ట్‌ సంస్థ, సంబంధిత వ్యక్తుల అధికారిక వివరణ వెలువడితేనే భూకేటాయింపు వ్యవహారంపై పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.