epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర
ఐదు లక్షలకు పైగా భక్తుల రాక అంచనా
ఈ నెల 28, 29న వనం విడిచి జనంలోకి సమ్మక్క–సారలక్కలు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
పులిగుండం వాగు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సరిసమానంగా పేరు గాంచిన గడ్డిగుట్ట మినీ మేడారం జాతరకు వేళాయె. లక్ష్మీదేవి పల్లి మండలం తడికలపూడి గడ్డిగుట్ట–వేపలగడ్డ ప్రాంతాల్లో నిర్వహించే ఈ జాతర ఈ నెల 28, 29 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనుంది. మేడారం జాతర ప్రారంభం కావడంతో అదే తరహాలో ఇక్కడి మినీ మేడారం జాతరపై భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. పూర్తిగా గిరిజన ప్రాంతంలో జరిగే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
ఈ జాతరను శుద్ధ గిరిజన సంప్రదాయాల ప్రకారమే నిర్వహించడం ప్రత్యేకత. ఆదివాసీ గిరిజన పూజారులే వనదేవతలకు సంబంధించిన పూజలు నిర్వహిస్తూ జాతర విశిష్టతను చాటుతున్నారు. గడ్డిగుట్ట వేపలగడ్డ ప్రాంతాల్లో జరిగే ఈ జాతర సందర్భంగా పులిగుండం వాగు దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన షాపులు, ఇతర సదుపాయాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా

రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. గత 50 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ జాతర విశిష్టతను గ్రామాల నుంచి పట్టణాల వరకు చాటేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ప్రచారం చేపట్టింది. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి, పులిగుండం, వేపలగడ్డ, హాలియా తండా, సర్వారం, బేతంపూడి, తడికలపూడి, తల్లాడ, జూలూరుపాడు, కాకర్ల, కొత్తగూడెం, రామవరం, సింగరేణి ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సమ్మక్క–సారలక్కలను దర్శించుకుంటారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో వనదేవతలు జనంలోకి వచ్చే ఘట్టం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. ఇందుకోసం గత పది రోజులుగా ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలక్కల కొలుపులతో గడ్డిగుట్ట ప్రాంతమంతా మంగళ వాయిద్యాలతో మార్మోగనుంది. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లక్ష్మీదేవి పల్లి పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

పులిగుండం వాగు వద్ద గట్టి నిఘా

దట్టమైన బండలతో ఏర్పడిన పులిగుండం వాగు వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అనుమతి లేకుండా వాగులోకి వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఈతగాళ్లను మోహరించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆలయ కమిటీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మినీ మేడారం జాతర ప్రధాన పూజారి ఊకే సీతమ్మ మాట్లాడుతూ.. గడ్డిగుట్ట ప్రాంతంలో గత 50 ఏళ్లుగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే ఈ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని, వనదేవతలను జనంలోకి తీసుకొచ్చే ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు. జాతరను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ బృందం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.