epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నోటిఫికేషన్ నుంచే ప్రవర్తన నియమావళి అమలు చేయాలి
పోలింగ్–కౌంటింగ్ వరకూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేప‌ట్టాలి
ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఓటింగ్ లక్ష్యం
జిల్లా అధికారుల‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స‌మీక్ష‌
ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచే ప్రవర్తన నియమావళి కఠినంగా అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి పంపిణీ–స్వీకరణ, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. జోనల్, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పిఓలు, ఎపిఓలు, ఎన్నికల సిబ్బంది నియామకంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భద్రత, వెబ్‌కాస్టింగ్ కీలకం

పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగాలన్నారు. పారదర్శకతే లక్ష్యంగా ప్రతి దశలో పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో పూర్తి సిద్ధం

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలోని 117 వార్డులకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వెబ్‌కాస్టింగ్, నోడల్–జోనల్ అధికారులు, రిటర్నింగ్–సహాయ రిటర్నింగ్ అధికారులు, పిఓలు–ఓపిఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ–స్వీకరణ, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమీక్షలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్‌డీవో సన్యాసయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.