epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”

“ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”
అభివృద్ధి మాట పట్టని ఓటర్లు
ఓటేయాలంటే నోటు తప్పనిసరి
మినిమం 2 వేలు – మాక్సిమం 8 వేలు
వార్డును బట్టి మారుతున్న రేటు
మధిరలో బహిరంగంగానే పంపకాలు
ఎన్నికల్లో నిజాయితీ అంతా మిథ్యా..!

కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సోమవారం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేదికలపై అభివృద్ధి మాటలతో పోటీపడ్డాయి. తాము చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెప్పుకుంటూ విమర్శలు–ప్రతివిమర్శలతో రాజకీయ వేడి రాజేసాయి. అభ్యర్థులు ప్రజలకు హామీల వర్షం కురిపించారు. సమస్యలు పరిష్కరిస్తామని, మధిర రూపురేఖలు మార్చేస్తామని ఊదరగొట్టారు. కానీ ప్రచారం ముగిసిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ప్రజాప్రతినిధిగా గెలవాలంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అభివృద్ధిపై భరోసా ఇవ్వాలి. కానీ మధిర మున్సిపల్ ఎన్నికల్లో ఆ మాటలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది హామీలు కాదు – ఓటుకు ఎంత ఇచ్చారన్న లెక్క మాత్రమే! ప్రచారంలో అధికార పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మధిరకు మంజూరైన నిధులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. రెండు పక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ ప్రచార పర్వం ముగిసిన క్షణం నుంచే అసలు ఎన్నికల రాజకీయం మొదలైంది. ప్రస్తుతం మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, జనసేన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అయితే అభ్యర్థుల వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాభావం వంటి అంశాలు ఇప్పుడు పెద్దగా లెక్కలోకి రావడం లేదు. ఓటర్ల నుంచి వినిపిస్తున్న ఏకైక మాట – “ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”

ఓటుకు నోటు – ఇదే తుది తీర్పు

ఒకప్పుడు పేదలు మాత్రమే ఓటుకు ఏదో ఆశపడతారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆస్తులు ఉన్నవారు, సంపన్నులు కూడా “మా డబ్బులు ఏవి?” అంటూ రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో అందరూ అడుక్కునేవారిలా మారిపోయారని అభ్యర్థులే వాపోతున్నారు. ఈసారి ఓటు రేటు కూడా భారీగా పెరిగింది. కనిష్టంగా రూ.2,000 నుంచి గరిష్టంగా రూ.8,000 వరకు ఒక్కో ఓటుకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గట్టిపోటీ ఉన్న వార్డుల్లో అయితే రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో వార్డులో సగటున 1,200 నుంచి 1,300 ఓటర్లు ఉంటారు. కనీసం రూ.2 వేల చొప్పున పంచినా అభ్యర్థికి రూ.10 లక్షల ఖర్చు తప్పదు. అంతకంటే తక్కువ ఇచ్చే అభ్యర్థి గెలుపు ఆశించడం కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

పంపకాల్లో కొత్త ఎత్తుగడలు

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అనేక రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొందరు అనుచరుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంపిస్తుంటే, మరికొందరు నేరుగా ఇళ్లకు వెళ్లి చేతులెత్తి దండం పెట్టి మద్దతు కోరుతున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు డబ్బులు ఇస్తూ కర్పూరం వెలిగించి అగ్నీ సాక్షిగా ప్రమాణాలు చేయిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌కు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు, వాహన సౌకర్యాలు కూడా అభ్యర్థులే భరిస్తున్నారు. దీంతో ఒక్కో ఓటుపై పడుతున్న ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. డబ్బులు పంచినా ఓటరు చివరకు ఎవరికీ ఓటేస్తాడో తెలియని పరిస్థితి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎంత ఖర్చు చేసినా గెలుపుపై ధీమా మాత్రం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఈ పంపకాల పర్వం సాగుతున్నా, ఎన్నికల వ్యవస్థలో ఇది భాగంగానే మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల తర్వాత నాయకులు ప్రజలను పట్టించుకోరన్న భావన ఓటర్లలో బలంగా ఉండటంతో, ఈ అవకాశాన్ని నగదు రూపంలో వసూలు చేసుకోవడంలో తప్పేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని పంపకాలు జరిగినా – చివరి క్షణంలో ఓటరు ఏ గుర్తుపై ముద్ర వేస్తాడో అన్నదే అసలు ప్రశ్న. ప్రచారం ముగిసింది… పంపకాలు కొనసాగుతున్నాయి… ఇక తేలాల్సింది ఒక్కటే.!
నోటుకు ఓటు పడుతుందా? లేక ఓటరు అంతరాత్మ గెలుస్తుందా? దానికి సమాధానం ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌తోనే తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.