epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!
దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు
ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు డిమాండ్
ఏడాదిన్నరగా కార్యాలయం చుట్టూ ప్ర‌దిక్ష‌ణ‌
ఆర్ఐ, సర్వేయర్ కుమ్మక్కయారంటూ రైతుల‌ ఆరోప‌ణ‌లు
కూసుమంచి రెవెన్యూ కార్యాల‌యంపై పెరుగుతున్న విమ‌ర్శ‌లు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితిపై చ‌ర్చ‌

కాకతీయ, కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ధరణి స్థానంలో భూభారతి విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో తమ భూముల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కూసుమంచి మండలంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా పాస్‌బుక్ పొందాలంటే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిందేనని రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదిన్నరగా పాస్‌బుక్‌ల కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన రావడం లేదని చెబుతున్నారు. పాస్‌బుక్ కావాలంటే ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పాస్‌బుక్ వస్తుండటంతో ఈ వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది.

దళారుల ద్వారా వసూళ్లు

గ్రామాల్లో ఏర్పాటు చేసిన దళారులు రైతులను సంప్రదించి పాస్‌బుక్ కావాలంటే నిర్దిష్టంగా డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారని రైతులు అంటున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్ కలిసి తమ పరిధిలోని గ్రామాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ రైతుకు పాస్‌బుక్ వచ్చే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకుని ఆ రైతుల వివరాలను దళారులకు అందజేస్తున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత దళారులు రైతులను సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పాస్‌బుక్ రావడంతో దళారుల ద్వారానే పని జరిగిందని రైతులు భావించే పరిస్థితి ఏర్పడింది. నిజానికి అర్హత ఉన్నప్పటికీ రైతులకు ఆ విషయం తెలియనీయకుండా ఈ వ్యవస్థ నడుస్తోందని చెబుతున్నారు.

రైతుల్లో పెరుగుతున్న అనుమానాలు

అదే గ్రామంలో కొందరికి పాస్‌బుక్ వస్తుండగా, మరికొందరికి రాకపోవడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. తమకు ఎందుకు పాస్‌బుక్ రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది రైతులు దళారులకు డబ్బులు ఇచ్చిన తర్వాతే పాస్‌బుక్ వచ్చిందని చెబుతుండటంతో ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మండల తహశీల్దార్‌కు సమాచారం ఉందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పై అధికారులకు తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే రైతులు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విచారణకు రైతుల డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.