epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి
కార్మికుల ఐక్యతతో పోరాటం విజయవంతం చేయాలని పిలుపు
విద్యుత్ బస్సుల విధానంపై ఆందోళన వ్యక్తం

కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని మంచికంటి భవనంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెంచుతూ, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటంలో కార్మికులంతా విశాల ఐక్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, 2017 వేతన ఎరియర్స్, 2021 మరియు 2025 వేతన సవరణల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు.
సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలను విరమించాలని వక్తలు డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్, ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ నవీన్ రెడ్డి, భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మెరుగు వెంకటరమణ, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం డిపో కార్యదర్శి బేతంపూడి బుచ్చిబాబు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ కోశాధికారి పగిళ్ళపల్లి నరసింహారావు, డిపో కార్యదర్శి గుగ్గిళ్ళ రోశయ్య, డిపో కమిటీ నాయకులు బుగ్గవీటి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.