వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలి
* ఎస్ఐ అపూర్వ రెడ్డి
కాకతీయ,చేర్యాల: వేసవిలో రోజు రోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ జీ. అపూర్వ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ.ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు బయటకు వెళ్ళకుండా ఉండే విధంగా ఉండాలని కోరారు.బయటకి వెళ్లి వచ్చిన తరువాత నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే తరచుగా నీటిని తాగుతూ ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగాలని, ఆ వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యున్ని సంప్రదించాలన్నారు.శరీరాన్ని డిహైడ్రేట్ చేసే ఆల్కహాల్,టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతాల పానీయాలు మానుకోవాలని సూచించారు. అంతేకాక ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమై బయటకు వెళ్ళవలసి వస్తే ఎండ తీవ్రత వల్ల అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని కాటన్ వదులు దుస్తులు, లేత,పల్చటి దుస్తులు,ధరించాలని, నిలువ ఉంచిన ఆహారం తిన కూడదని, ద్రవపదార్థాలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.. ఉదయం ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శీతల పానియాలు తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు ఉపశమనం తప్ప ఉపయోగం ఉండదని తెలిపారు.

