epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైద్యం ముసుగులో ‘వ్యాపార’ వికృతం!

వైద్యం ముసుగులో ‘వ్యాపార’ వికృతం!
రోగి నాడి చూడకముందే జేబుపై కన్నేస్తున్న ఆస్ప‌త్రులు
హోటళ్లను మించిన బెడ్ చార్జీలు.. లాడ్జ్లను తలపిస్తున్న గదులు
నిబంధనలకు తిలోదకాలు.. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే చికిత్స
‘ఆరోగ్యశ్రీ’ నిధులే లక్ష్యంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న దవాఖానాలు
ఆహార సేవల పేరిట రెస్టారెంట్ స్థాయి వసూళ్లు
త‌నిఖీల‌కు దూరంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
కాకతీయ, వరంగల్ : వైద్యం అంటే ఒకప్పుడు ప్రాణదానం.. నేడు అది పక్కాగా ధనార్జన వ్యాపారంగా రూపాంతరం చెందింది. రోగి నాడి పట్టుకుని ప్రాణం పోయాల్సిన వైద్యం.. నేడు రోగి ఆర్థిక స్తోమతను బట్టి ‘బిల్లుల’ వైద్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సాగిస్తున్న ఈ అక్రమ వసూళ్ల పర్వం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. జబ్బు చేసి ఆసుపత్రి గడప తొక్కితే చాలు.. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అడుగడుగునా దోపిడీ పర్వం నిరాటంకంగా సాగుతోంది. పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలను తలదన్నేలా, ఆసుపత్రి యాజమాన్యాలు రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.
ఇరుకు గదుల్లో నిర్బంధం!
సాధారణంగా ఏ వ్యాపార సంస్థకైనా వెళ్తే సందర్శన ఫీజులు ఉండవు. కానీ  ప్రైవేటు ఆసుపత్రుల్లో అడుగుపెడితేనే ‘కన్సల్టేషన్’ పేరిట రూ. 500 నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. రోగికి చికిత్స అందించే గదుల పరిస్థితి అయితే మరీ దారుణం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోని గదులు లాడ్జ్లను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం రోగి కోలుకోవడానికి గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. కానీ, లాభాలే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. ఇరుకైన గదుల్లో కేవలం ఒక బెడ్, టేబుల్ వేసి రోజుకు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నాయి. గాలి చొరబడని, వెలుతురు సోకని ఇరుకు గదుల్లో ఖైదీల మాదిరిగా రోగులకు నిర్బంధ వైద్యం అందిస్తూ వారిని మానసికంగా, ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారు.
‘ఆరోగ్యశ్రీ’ నిధులే ఆయుష్షు.. అదనపు వడ్డింపులు!
ప్రైవేటు ఆసుపత్రుల పుట్టగొడుగుల పెరుగుదలకు ‘ఆరోగ్యశ్రీ’ నిధులే ప్రధాన ఆకర్షణగా మారాయి. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆసుపత్రుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ప్రభుత్వ నిధులను గుంజుకోవడమే లక్ష్యంగా కార్పొరేట్ వైద్యం విస్తరిస్తోంది. అయితే, కేవలం ప్రభుత్వ నిధులతోనే సంతృప్తి చెందని యాజమాన్యాలు.. రోగుల నుంచి అదనపు బిల్లులు వసూలు చేస్తూ రెట్టింపు లాభాలు గడిస్తున్నాయి. మందుల ధరల విషయంలోనూ నిలువు దోపిడీ సాగుతోంది. బయట మార్కెట్ లో రూపాయికి దొరికే మాత్రలకు కూడా ఆసుపత్రి ఫార్మసీల్లో వందల రూపాయలు వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. మత్తు డాక్టర్లకు, కన్సల్టెంట్లకు ప్రత్యేక ఫీజుల పేరిట వేల రూపాయల భారం మోపుతున్నారు.
రెస్టారెంట్లుగా దవాఖానాలు.. 
వైద్య సేవలతో ఆగని ఈ వ్యాపారం.. ఇప్పుడు ఆహార రంగంలోకి సైతం చొచ్చుకుపోయింది. రోగులకు, వారి సహాయకులకు ఫుడ్ సర్వీస్ అందిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు హోటల్ వ్యాపారం చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కిచెన్లను నిర్వహిస్తూ, రోగికి పెట్టే పత్యం ఆహారానికి సైతం రెస్టారెంట్ స్థాయి ధరలను వసూలు చేస్తున్నాయి. వైద్యం ముసుగులో హోటళ్లు, లాడ్జ్లు, రెస్టారెంట్ల మేళవింపుతో సాగుతున్న ఈ దందాపై నిఘా కరువైంది. ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతుండటంతో, కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తూ సాగిస్తున్న ఈ ‘వైద్య వికృత’ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.