epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాతోనే ఆట‌లా ?

  • కేంద్రం నా బెంచ్‌ను త‌ప్పించాల‌ని చూస్తోంది
  • సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మరో 20 రోజుల్లోనే ముగియ‌నున్న పదవీకాలం
  • రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ !

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ కీలక పిటిషన్ విషయంలో కేంద్రం చేసిన విజ్ఞప్తి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సుప్రీంకోర్టుతో ఆటలాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ తాజాగా కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. అయితే ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. తీర్పు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ట్రైబ్యునల్ రిఫామ్స్ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ కొనసాగుతోన్న మధ్యలో కేంద్రం అభ్యర్థించడం గమనార్హం. నవంబరు 3న సోమవారం పిటిషనర్ల వాదనలు పూర్తయ్యాక, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి వీలుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరడంతో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలని ఏజీ అభ్యర్థించారు. దీంతో షాకైన న్యాయమూర్తులు.. ‘ప్రస్తుత బెంచ్‌ను తప్పించుకోవాలనే రీతిలో కేంద్రం ఉన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.

ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని ఊహించలేదు

‘‘కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంభిస్తుందని, న్యాయస్థానంతో ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని మేము ఊహించలేదు..’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 20 రోజుల్లోనే జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ‘‘మేము పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తిస్థాయిలో విన్నాం.. వాదనలు పూర్తయిన తరువాత ఏ ఒక్కసారి కూడా అటార్నీ జనరల్ ‘కేంద్ర ప్రభుత్వం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ అంశం రిఫర్‌ చేయమందని కోరలేదు’’ అని పేర్కొన్నారు. ‘కానీ, మేము ఈ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.. అలాగే, ప్రస్తుత ధర్మాసనాన్ని కేంద్రం తప్పించుకునే ఉద్దేశంలో ఉంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో సీజేఐ పదవీకాలం ముగియనుంది’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.