epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి
ఈటల డిమాండ్

హుజూరాబాద్ ప్రజలే నా బలం ఎలా మర్చిపోతా ఈటల

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో రోజులు లాగుతున్నారు. క్వింటాల్‌కు ఎనిమిది కిలోలా తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్ ఇప్పటికీ అందరికీ చేరలేదని, ఈసారి అయినా ప్రతి రైతుకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.రైతు రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదని, వరదలతో మునిగిన వరి రైతులు, తుఫానుతో నష్టపోయిన రైతులు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. పత్తి కొనుగోళ్లలో కూడా జాప్యం ఉండకూడదని, కఠినమైన ‘7 క్వింటాళ్ల’ నిబంధనను ఎత్తివేయాలని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీసీఐ కూడా నిబంధనలు సడలించాలని కోరారు. ఫసల్ భీమా చెల్లింపులు ప్రభుత్వం సమయానికి చేస్తే రైతులు ఇబ్బందులు పడేవారేమన్నారు.

హుజూరాబాద్‌లో మాకు మెజారిటీ సీట్లు ఈటల ధీమా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండేందుకే వారి పాత్ర కీలకమని చెప్పారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున బూతు స్థాయిలో పటిష్ట బలం ఏర్పరుస్తామని ప్రకటించారు. జిల్లాలోని 107 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ భాగం తమ పార్టీ గెలుచుకునే సత్తా ఉందన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటేసిన ప్రజలు ఎదురుచూసిన పనులు రెండు సంవత్సరాలుగా జరగకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.నన్ను 25 సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్ గడ్డ ఆ ప్రజలను ఎలా మర్చిపోతా అని భావోద్వేగంతో చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, చీకట్లోనే రోజులు గడుస్తున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.

ఉన్నదాన్ని చెప్పుకోలేని వారు అబద్ధాలతో బ్రతుకుతున్నారు

తాము చేసిన అభివృద్ధి పనులను ఎప్పుడూ ప్రచారం చేయలేదని, ధర్మాన్ని, ప్రజలను, పనిని నమ్ముకున్న వాడినేనని ఈటల అన్నారు.తట్టెడు మట్టి తీయలేదంటారా హుజూరాబాద్‌లో వేగవంతమైన నాలుగు లైన్లు ఎవరు వేశారు? కరెంట్ కోసం కంటిరెప్పపాటు ఎదురు చూడని విధంగా సబ్‌స్టేషన్లు ఎవరు నిర్మించారు? జలకళ కోసం చెక్‌డ్యామ్‌లు ఎవరు కట్టించారు? కమలాపూర్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.ఇవన్నీ ప్రజలకు తెలుసు దొంగముఖాలకు అర్థం కాదు. అబద్ధాలే ఆధారంగా బ్రతికే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా, బీజేపీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మహిళా మోర్చా జిల్లా ప్రతినిధి రమరెడ్డి, పార్టీ నాయకులు సమ్మయ్య, దేవిక, చొప్పరి వేణు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.