epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

3 వేల గోనె సంచుల గోల్‌మాల్‌?

3 వేల గోనె సంచుల గోల్‌మాల్‌?
చెన్నారావుపేటలో రైతుల ఆగ్రహం
గన్నిల కొరతపై అధికారులను నిలదీసిన రైతులు
పంపిణీలో అక్రమాలంటూ ఆరోపణలు

కాకతీయ, చెన్నారావుపేట: అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గోనె సంచుల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయంటూ చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 వేల గోనె సంచులు గల్లంతయ్యాయంటూ రైతులు ఆరోపించగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించేందుకు శనివారం చెన్నారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గోనె సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల చుట్టూ తిరిగినా సరైన స్పందన లేదని వాపోయారు.

3 వేల సంచులు ఎటు..?
రైతుల ఫిర్యాదులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్న సీఈఓ చిట్టే రవిని గోనె సంచుల లభ్యతపై ప్రశ్నించగా 10 వేల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే రైతులు ఇన్‌చార్జి అధికారి కట్టారెడ్డిని అడగగా కేవలం 7 వేల సంచులే ఉన్నాయని చెప్పడం వివాదానికి దారితీసింది. గంటల వ్యవధిలోనే 3 వేల సంచులు ఎటు వెళ్లాయని రైతులు అధికారులను నిలదీశారు.
కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులకు గోనె సంచులు కట్టబెట్టారని, సామాన్య రైతులకు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించిన వారికే కాంటాలు, గోనె సంచులు ఇస్తున్నారని మండిపడ్డారు.

పంపిణీపై అనుమానాలు
నేరుగా రైతులకు సంచులు పంపిణీ చేయాలని కోరినా విధానాలు వేరుగా ఉన్నాయి అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కట్టారెడ్డి అనే అధికారి డబ్బులు తీసుకుని 3 వేల సంచులను పక్కదారి పట్టించారని బహిరంగంగానే ఆరోపించడం కలకలం రేపింది.
సీరియల్ టోకెన్ల జారీ ప్రక్రియలో కూడా గందరగోళం నెలకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి ఒక మాట, మరో అధికారి మరో మాట చెప్పడంతో రైతుల్లో అనుమానాలు మరింత పెరిగాయని తెలిపారు. పంపిణీలో ఎలాంటి పారదర్శకత కనిపించడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ఎండ తీవ్రత, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
గోనె సంచుల పూర్తి వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని రైతులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, జక్క అశోక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.