epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ లేఅవుట్లకు కేరాఫ్‌గా కరీంనగర్  బ‌ల్దియా

అక్రమ లేఅవుట్లకు కేరాఫ్‌గా కరీంనగర్  బ‌ల్దియా
ప్రభుత్వ భూముల్లో రియల్‌ ఎస్టేట్ సాగుతోంది
సూడా, మున్సిపల్ అధికారుల స‌హ‌కారంతోనే దందా
మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు
అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవకతవకలు యథేచ్ఛగా సాగుతున్నాయని కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు, శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సూడా) అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరంలో విలీనమైన గ్రామాల్లో కొత్తగా అక్రమ లేఅవుట్ల దందా ప్రారంభమైందని, దీనికి అధికారులే ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల క్రితమే పలు సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ లేఅవుట్లపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
10 శాతం ప్రజా అవసరాల భూమి మాయం
నగరంలోని సర్వే నంబర్లు 52, 53, 85, 102, 115 ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రవీందర్ సింగ్ తెలిపారు. అక్రమ లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల ఆదాయ గండి పడుతోందని విమర్శించారు. నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన లేఅవుట్లలో 10 శాతం భూమిని పార్కులు, రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్‌లు, ఇతర సామాజిక అవసరాల కోసం కేటాయించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ అధికారులు ఆ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టేశారని ఆరోపించారు. చింతకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 439లో ఏకంగా ప్రభుత్వ భూమినే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీల పేరుతో కొత్త అక్రమాలు
సూడా పరిధిలో గేటెడ్ కమ్యూనిటీల పేరుతో కొత్త తరహా అక్రమాలకు తెరలేపారని సర్ధార్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే లేఅవుట్లు మంజూరు చేస్తున్నారని, అల్గునూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు, సాగుభూములను ఓపెన్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లలో భారీగా నిబంధనల ఉల్లంఘనలు (డివియేషన్లు) ఉన్నప్పటికీ, ముడుపులు తీసుకుని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో రెండుసార్లు తిరస్కరించిన ఫైళ్లు, మూడోసారి ఎలా ఆమోదం పొందుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే నిబంధనల పేరుతో వేధించే అధికారులు, కోట్ల రూపాయల అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ భూములను కన్వర్షన్ (ల్యాండ్ యూజ్ మార్పు) చేయకుండానే కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వెంటనే ఈ అక్రమ లేఅవుట్లను అరికట్టి, బాధ్యులైన అధికారులపై, రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.