epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.4వేల కోట్ల అప్పుల్లో సింగ‌రేణి

రూ.4వేల కోట్ల అప్పుల్లో సింగ‌రేణి
కాళేశ్వరాన్ని కూల‌గొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర‌
కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల‌ని చూస్తున్న ఆ పార్టీ లీడ‌ర్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఘెర వైఫ‌ల్యం
మ‌ళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
పాత కార్యకర్తలందరిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం
పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు : తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి రూ.4వేల‌ కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, సంస్థ అలా అప్పుల్లో కురుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అని పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ రేగా కాంతారావు ఆరోపించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వలస కాంగ్రెస్ నాయకులు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో 39 రాష్ట్రాల్లో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ దిగజారి పోతుందని రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలస నాయకులు వచ్చి.. మేమే అసలైన కాంగ్రెస్ నాయకులు అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వలస నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని, వారంతా కంకణం కట్టుకున్న బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. అబద్ధాలు, మాయమాటలు చెప్తూ వీరందరూ నిజమైన కాంగ్రెస్ పార్టీని చంపేయాలని కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
కాలేశ్వరం ప్రాజెక్టును ఎలాగైనా కూలగొట్టాలనే దుర్మార్గుపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని రేగా కాంతారావు ఆరోపించారు. గతంలో కాలేశ్వరం కూలిందంటూ ఎంక్వయిరీ కొచ్చిన కమిషన్ ఏమైందని, ఆ కమీషన్ ఎటు పోయిందని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ప్రాజెక్టుని కూలగొట్టాలనే కుట్రతోనే అక్కడ యంత్రాల ద్వారా విచ్చలవిడిగా ఇసుకను తోడుతున్నారని, రాత్రి వేళల్లో జిల్టిక్స్ పెట్టి పేలుళ్లు జరుపుతున్నారని విమర్శలు కురిపించారు. అంతర్జాతీయంగా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అపార పేరు ప్రతిష్టలు సంపాదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కుట్రలు పన్నెందుకే ప్రాజెక్టు వద్ద ఈ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పాత కార్యకర్తలకు ఆహ్వానం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రజలు ఈ పాలనపై విసుగు చెందారని రేగా కాంతారావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ కారణాల వల్ల గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన పాత నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరిని మళ్ళీ సొంత గూటికి ఆహ్వానిస్తున్నానని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, యాదగిరి గౌడ్, తురక కోటి, రవి ప్రసాద్, రంజిత్, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను, నుకారపు రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.