గిరిజనేతరుల భూముల్లోకి గిరిజన రైతులు
గిరిజనులు-గిరిజనేతరుల మధ్య భూ వివాదం
ఐటీడీఏ క్రాస్ రోడ్ రాళ్ళకుంట చెరువు శివారులో ఉద్రిక్తత
పత్రాలు లేనిదే ఆక్రమణలు తగదని స్పష్టం చేసిన ఎస్సై
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్రాస్ రోడ్ రాళ్ళకుంట చెరువు శివారు భూములలో స్థానికేత గిరిజనులు, పూర్వం నుండి ఉంటున్న స్థానిక గిరిజనేతరుల పంట పొలాల భూముల్లో ఆక్రమణకు పాల్పడుతుండడంతో ఆదివారం ఇరువర్గాల మద్య ఘర్షణ జరుగుతుందని సమాచారం తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్సై బొంకురి మహేష్ తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక గిరిజనేతర రైతులకు, భూఆక్రమణకు వచ్చిన స్థానికేతర గిరిజనులకు నడుమ జరుగుతున్న వాగ్వాదాన్ని అడ్డుకుని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికేతర గిరిజనుల వివరణ ఇలా ఉంది మేము ఆదివాసీయులం ఈ ప్రాంతంలో ఎక్కడి భూములలో అయిన మేము ఉండే హక్కులు రాజ్యంగం మాకు చట్టాలు కల్పించిందని, అందుకే మేము ఈ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని ఎస్సైకి తెలిపారు.
స్థానిక గిరిజనేతరుల వివరణ ఇలా ఉంది. మేము పూర్వం నుండి ఈ భూములలో సాగుచేసుకుంటూ జీవనం పొందుతున్నాము ప్రాణాలైన వదిలేస్తాం భూముల జోలికి వస్తే ఊరుకోమని, వేర్వేరు ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చి కబ్జాలకు పాల్పడి గిరిజన,గిరిజనేతరులుగా విభజిస్తూ తగాదాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమని ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తూ స్థానికేతరుల ఆగడాలను అడ్డుకుంటామని ఎస్సైకి వివరనిచ్చారు.
ఇరువర్గాల వివరణ విన్న ఎస్సై ఇలా అన్నారు. ఖాలీగా ఉన్న భూములలో ఈ విధంగా గుడిసెలు వేసుకోవచ్చని మీ వద్ద ఏమైన జీవోలు ఉంటే తీసుకురండీ అంతేకాని ఎలాంటి ఆదారాలు లేకుండా ఇలా ఘర్షణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఎస్సై మహేష్ తెలిపారు.

