చేర్యాల ఘన చరిత్ర చెరిపివేత
చారిత్రక ఆనవాళ్లు నేలమట్టమై నాలుగేళ్లు
తొందరపాటు నిర్ణయాలతో మున్సిపల్ భవనం కూల్చివేత
పాత ప్రభుత్వ ఆస్పత్రిలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు
ప్రజలకు అసౌకర్యం.. వ్యాపారులకు తీరని నష్టం
నూతన నిర్మాణాలకు ఇంకెన్నాళ్లు?.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
కాకతీయ, చేర్యాల : చారిత్రక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన చేర్యాల మున్సిపల్ భవనాన్ని అనాలోచిత ని ర్ణయంతో పునర్నిర్మాణం పేరిట హడవుడిగా కూల్చివేశారు. కార్యాలయ భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్సులను నేలమట్టం చేశారు. చేర్యాల ప్రభుత్వ పాత హాస్పత్రికి మున్ని పల్ కార్యాలయాన్ని తరలించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజాంకాలంలో నల్గొండ జిల్లాలో చేర్యాల తహశీల్ కేంద్రంగా వెలుగొందింది. ఆనాడు నైజాం అధికారులు రాచరిక పనులపై చేర్యాలను సందర్శించినప్పుడు విశ్రాంతి కేంద్రంగా ఈ భవనం ఉపయోగపడింది. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయంగా సేవలందించింది. తదనంతర పరిణామాల్లో గ్రామపంచాయతీగా మార్పు చెందింది. ఈ క్రమంలో పాత భవనం స్థానంలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ గా ఏర్పడి పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా సేవలదించింది. ఇంతటి నేపథ్యం ఉన్న మున్సిపాలిటీ, దుకాణ సముదాయాన్ని కూల్చివేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్సులో ఎంతో మంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందారు. చిన్న చిన్న దుకాణాలు నిర్వహించు కుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. భవనాన్ని కూల్చివేయడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఇంకా యాభై ఏళ్ల పాటు సేవలు అందించే సామర్యం ఉన్న భవన సముదాయాన్ని ప్రజలు, ప్రముఖులు, వ్యాపారస్తులు,రాజకీయ పార్టీలు, సంఘాల అభిప్రాయం తీసుకోకుండానే స్వార్ధ ప్రయోజనాలు, కమీషన్ల కోసం కూల్చివేశారన్న విమర్శలను మున్సిపల్ పాలక మండలి, ప్రభుత్వం మూటగట్టుకుంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల మున్సిపాలిటీకి సొంత భవనం లేకుండా పోయింది. మున్సిపాలిటీకి ఆదాయం సమాకురుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నదుకాణ సముదాయం కులగొట్టడంతో అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రోడ్డునపడ్డారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కొరకు ప్రభుత్వం ప్రతి పాదనలు సిద్ధం చేసిన కట్టడం ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అది పూర్తి కావాలంటే ప్రస్తుతం చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో ఉన్న సింహభాగానికి నిరందిస్తున్న 320 కేఎల్ సామర్థ్యం ఉన్న మంచి నీటి ట్యాంకును కూల్చి వేయ్యాల్సి ఉంటుంది. ఇది నిర్మించి సుమారుగా 50 ఏళ్లు అవుతుంది. కాగా శిధిలా వ్యవస్థలో ఉండగా ప్రాణా ప్రమాదానికి పొంచి ఉంది.


అధికార పార్టీ, ఎమ్మెల్యేపై విమర్శలు
తొందరపాటు నిర్ణయాలతో చేపట్టిన కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితులను అధికార పార్టీ నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టించుకోవడం లేదని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా షెడ్లు తొలగించారని, దీంతో అనేక కుటుంబాలు ఉపాధి, జీవనాధారాన్ని కోల్పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు జరిగినప్పటి నుంచి బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నష్టపరిహారం లేదా పునరావాసంపై కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శింస్తున్నారు.బాధితుల పరిస్థితిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చెప్పటి షేటర్ల నిర్మాణాలు చేపట్టి వారికీ అండగా నిలవాలని కోరుతున్నారు.
షెడ్డు నిర్మాణంతో డబ్బు వృథా
మున్సిపల్ దకాణ సముదాయాన్నికూల్చినప్పటి కీ పాత భవన స్థలంలో వెజ్, నాన్ వెజ్ వ్యాపారుల కోసం కాంప్లెక్స్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. వాటితో వెజ్ మార్కెట్ నిర్మించగా వెజ్ వ్యాపారస్తులు కాంప్లెక్సులో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనాలోచితంగా రేకుల షెడ్డుతో నిర్మించిన నాన్ వెజ్ షెడ్డులో వాటర్ సౌకర్యం, డ్రైనేజీతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారస్తులు షెడ్డులో వ్యాపారం చెయ్యలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా నిర్మించిన షెడ్డు కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. నాన్ వెజ్ వ్యాపారస్తులు అంగడి బజార్ లోని మున్సిపల్ ఆవరణలో ఉన్నరోడ్డుకు ఇరువైపులా తాత్కాలికంగా పరదాలతో షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి షేటర్ల నిర్మాణాలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.
గత ప్రభుత్వం నిర్ణయంతో రోడ్డున పడ్డాం
– జామలపూర్ శ్రీనివాస్, మటన్ షాపు వ్యాపారి
మున్సిపల్ కాంప్లెక్సులో దశాబ్దాలుగా 15 మటన్ షాపులు, 14 చికెన్ షాపులు నడుపుకుంటూ వ్యాపారం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనాలోచితంగా కొత్త భవనాల నిర్మాణం పేరిట కూల్చివేతతో వ్యాపారులం దరం నిరాశ్రయులయ్యాం. వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ భవనం కొత్తగా నిర్మించి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నది. ఎలాంటి సౌకర్యం లేకుండా నిర్మించడం వల్ల కాంప్లెక్స్ భవనంలోకి వెళ్లలేకపోతున్నాం. వెంటనే కొత్తగా షట్టర్లతో నిర్మాణాలు చేపట్టి యథావిధిగా షాపులను మాకు కేటాయించాలి.


