epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విశాఖ జోన్‌లోకి మధిర రైల్వే స్టేషన్‌..?

విశాఖ జోన్‌లోకి మధిర రైల్వే స్టేషన్‌..?
సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడకు మార్పుపై ఆందోళ‌న‌
స్టేష‌న్ ఆదాయం ఆంధ్రకు వెళ్లే ప్రమాదమని ఆగ్రహం
రైళ్ల నిలుపుదల తగ్గే అవకాశంపై ప్రయాణికుల్లో భయం
మధిర స్టేషన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికుల ఆవేదన
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వ‌హిస్తోందంటూ ప్రజల్లో విమర్శలు
వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్
స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలని విజ్ఞప్తి

కాకతీయ, మధిర : ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్ పరిధి నుంచి విజయవాడ డివిజన్‌లోకి మార్చే ప్రతిపాదనలు స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ డివిజన్‌లో కొనసాగుతున్న ఈ స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్‌లో కలుపుతున్నారన్న సమాచారం వెలువడింది. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న కీలక రైల్వే స్టేషన్ పరిపాలన ఇతర రాష్ట్ర పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మధిర రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటివరకు తెలంగాణకు చెందుతుండగా, విజయవాడ డివిజన్‌లోకి మారితే ఆ ఆదాయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఉన్న స్టేషన్ ఆదాయం ఇతర రాష్ట్రానికి మళ్లడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రైళ్ల నిలుపుదల తగ్గే ప్రమాదం

మధిర రైల్వే స్టేషన్ ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్యమైన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు మధిరలో నిలుస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ స్టేషన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్తే రైళ్ల నిలుపుదల తగ్గే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లు ఒక దిశలో మాత్రమే నిలుస్తున్నాయని, ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రైల్వే పరంగా మధిర సెక్షన్ పరిధి దెందుకూరు నుంచి పందిళ్లపల్లి వరకు విస్తరించి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కొండపల్లి నుంచి మోటమర్రి వరకు ఉన్న కొంత భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలుపుతున్నట్లు సమాచారం. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో మధిర స్టేషన్ ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్

పరిపాలన పరంగా స్టేషన్ విజయవాడ డివిజన్‌లోకి మారితే స్థానిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్ర అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధి, సౌకర్యాల కల్పన వంటి అంశాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మధిర స్టేషన్ ఖమ్మం తర్వాత జిల్లాలో కీలక రైల్వే కేంద్రంగా ఉండటంతో దీని ప్రాధాన్యం తగ్గిపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగించేందుకు కేంద్ర రైల్వే శాఖతో చర్చలు జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.