కాంగ్రెస్లోకి చేరికల జోరు!
మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన బడి తండా నాయకులు
సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చేరికలు
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు
కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు సాగుతోంది. మండలంలోని ఉమ్మడి మానాల పరిధి బడి తండాకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మానాల మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. పార్టీ బలోపేతానికి శ్రమించే ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం, ఉచిత విద్యుత్ వంటి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారిలో మాజీ ఉపసర్పంచ్ గుగులోతు హరిదాస్, జి.శిరాలాల్, జి.పేరెంగీలాల్, జి.బలరాం, అంగోత్ అంగూర్, జి.బన్సీ, బానోత్ నర్సింగ్, బి.మణిరామ్, జి.మంగ్యా, జి.వసంత్, జి.రాజు, జి.శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తూమ్ జలపతి, రిటైర్డ్ ఈడీ లక్ష్మణ్ నాయక్, తండా పెద్దలు రాజు, వినోద్, మదన్, రమేష్, తిరుపతి పాల్గొన్నారు.

