లింగంపేట, కట్ట లింగంపేట గ్రామాల్లో ‘బడిబాట’
కాకతీయ, చందుర్తి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా చందుర్తి మండలంలోని లింగంపేట, కట్ట లింగంపేట గ్రామాల్లో “బడిబాట” కార్యక్రమం నిర్వహించారు. జడ్పీహెచ్ఎస్ లింగంపేట ప్రధానోపాధ్యాయురాలు వై. ఉమారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటికీ వెళ్లి విద్యా చైతన్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట సర్పంచ్ కొక్కుల నరేష్, ఉప సర్పంచ్ ఆకులు ఎల్లయ్య, కట్ట లింగంపేట సర్పంచ్ ఆవారి రమేష్, ఉప సర్పంచ్ ఎల్ల దశరథం పాల్గొని బడి ఈడు గల పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న డిజిటల్ విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. జనార్ధన్, ఏ. లింగయ్య, కే. తిరుపతి, సుధారాణి, లావణ్య, రజిత, స్వరూపారాణి పాల్గొన్నారు.

