epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

  • గోదావరి జలాల వినియోగంపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టాలి
  • ఎల్‌ఎండీకి వెంటనే నీరు విడుదల చేయాలి
  • సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
  • విద్యార్థులపై బలప్రయోగాన్ని సీపీఐ ఖండన

కాకతీయ, కరీంనగర్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జీ చేయడం అమానుషమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు చేపట్టిన నిరసనపై లాఠీచార్జీ, భాష్పవాయు ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అవి మరింత ఉధృతమవుతాయని పేర్కొన్నారు. నైతిక విలువలు, రామరాజ్యం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ వాటిని ఆచరణలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులపై బలప్రయోగాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

గోదావరి జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి

తెలంగాణ మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. 1996 నుంచే సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ అంశంపై ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి, గండిపల్లి వంటి ప్రాజెక్టులు ముందుకు సాగాయని పేర్కొన్నారు.

ఎల్‌ఎండీకి వెంటనే నీరు విడుదల చేయాలి

దిగువ మానేరు జలాశయంలో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరడంతో కరీంనగర్ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీకి వెంటనే నీటిని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు రావాలని, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఆరోపణలకు అతీతంగా ప్రజలకు సాగు, తాగునీరు అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బాకం ఆంజనేయులు, కసిబోజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.