epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సాగుకు సిద్ధం చేస్తున్న ఎస్సారెస్పీ భూములు!

సాగుకు సిద్ధం చేస్తున్న ఎస్సారెస్పీ భూములు!
దుక్కులు దున్ని.. పైపులైన్లు వేసి సాగుకు ఏర్పాట్లు
అధికారుల హెచ్చరికల తర్వాతా ఆగని ఆక్రమణ పనులు
చెట్లు పెంచుతామన్న అధికారుల మాటలు.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి
చర్యలు లేకపోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు

కాకతీయ, శంకరపట్నం : ప్రభుత్వ భూములకు రక్షణ కరువవుతోందా? అధికారులు హెచ్చరించినా ఆక్రమణ పనులు ఆగడం లేదా? కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని ఎస్సారెస్పీ భూముల విషయంలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని భూమిని కొందరు దుక్కులు దున్ని, నీటి పైపులైన్లు ఏర్పాటు చేసి సాగుకు సిద్ధం చేస్తున్నా.. అధికారులు మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేశవపట్నం గ్రామ శివారులో ఎస్సారెస్పీ భూమిని సాగుకు సిద్ధం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సారెస్పీ ఏఈ పావని అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేయవద్దని సంబంధిత వ్యక్తిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చెట్లు పెంచనున్నట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. ఆక్రమణకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని కూడా స్పష్టం చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు హెచ్చరించి వెళ్లిన తర్వాత కూడా అదే భూమిలో ఆక్రమణ పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దుక్కులు దున్నడంతో పాటు నీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. అధికారుల ప్రత్యక్ష పరిశీలన, హెచ్చరికల తర్వాత కూడా పనులు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిలో సాగుకు ఇంత బహిరంగంగా ఏర్పాట్లు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అధికారుల తీరుపై అనుమానాలు

ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్లే మళ్లీ పనులు కొనసాగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్వయంగా పరిస్థితిని పరిశీలించిన తర్వాత కూడా దుక్కులు దున్ని, పైపులైన్లు వేసే స్థాయిలో ఆక్రమణ పనులు కొనసాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులపై ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు, అధికారిక నిర్ధారణ మాత్రం వెలువడాల్సి ఉంది. ఎస్సారెస్పీ భూమిలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సారెస్పీ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కేవలం హెచ్చరికలు జారీ చేసి వదిలేయకుండా.. ఆక్రమణలను అడ్డుకుని, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేశవపట్నం శివారులోని ఎస్సారెస్పీ భూములపై జరుగుతున్న ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల హెచ్చరికల తర్వాత కూడా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా? అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.