epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!
ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం
ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్‌ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.

ఐదు దశల ప్రణాళిక..

దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్‌ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించ‌డం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయ‌డం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.

ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వ‌ల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.

కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మ‌రోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం

ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్‌ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.

ఐదు దశల ప్రణాళిక..

దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్‌ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించ‌డం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయ‌డం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.

ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వ‌ల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.

కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మ‌రోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌,...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.