epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్‌’ అంటూ దేశం నివాళులు

2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్‌’ అంటూ దేశం నివాళులు
లష్కరే దాడులకు 17 ఏళ్లు
నెవర్‌ఎవర్‌ థీమ్‌తో గేట్‌వే వద్ద ప్రత్యేక కార్యక్రమం
విద్యార్థులతో శాంతి – జాతీయ భద్రత ప్రతిజ్ఞ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : భారత్ ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దారుణ దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ముష్కరులు ముంబైను రక్తపాతం మయం చేసిన ఆ భయానక రాత్రిని దేశం ఇంకా మరువలేదు. అమాయక ప్రజల రక్తంతో నగరం తడిసిన ఆ దుర్ఘటనను ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ దేశం అమరవీరులకు నివాళులు అర్పిస్తుంది.

ఈ సంవత్సరం ముంబైలో ‘నెవర్‌ఎవర్‌(Never Ever) – మళ్లీ ఎప్పటికీ జరగకూడదు’ అనే థీమ్‌తో స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గేట్‌వే ఆఫ్ ఇండియాలో ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉగ్రదాడుల్లో మరణించిన వారి ఫొటోలతో ప్రత్యేక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు భద్రతా బలగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. రాత్రి సమయంలో గేట్‌వేను త్రివర్ణ కాంతులతో అలంకరించడంతో పాటు ‘నెవర్‌ఎవర్‌’ అనే పదాలతో ప్రత్యేక లైట్ షోను కూడా ఏర్పాటు చేశారు. మ‌రోవైపు ముంబై గల వివిధ విద్యాసంస్థల విద్యార్థులతో శాంతి, ఐక్యత, జాతీయ భద్రతపై ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 11 కాలేజీలు, 26 పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకతగా మారింది. యువతలో భద్రతపై అవగాహన పెంపొందించడం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తిప్పికొట్టే నిబద్ధతను బలపరచడమే దీని లక్ష్యం.

కాగా, 26/11 ఉగ్రదాడి భారత భద్రతా వ్యవస్థకు వచ్చిన అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి. 10 మంది ఉగ్రవాదులు కరకచర్‌ సముద్రం నుంచి ఓ ఫిషింగ్ బోట్‌ను హైజాక్ చేసి, భారత తీరానికి సమీపంగా వచ్చి, మరో చిన్న పడవలో ముంబైకి దిగారు. నగరంలోకి వచ్చిన వెంటనే వారు వేర్వేరు గ్రూపులుగా విడిపోయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫే వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పర్యాటకులు, ప్రయాణికులు, ఉద్యోగులు.. ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. 60 గంటలపాటు సాగిన ఈ నరమేథంలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేప‌థ్యంలోనే రంగంలోకి దిగిన NSG కమాండోలు, మారైన్ కమాండోలు, ఆర్మీ యూనిట్లు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ ఆపరేషన్‌లో 9 మంది ఉగ్రవాదులు హతమై, అజ్మల్ కసబ్ మాత్రమే బ్రతికి పట్టుబడ్డాడు. తరువాత అతనికి కూడా ఉరిశిక్ష అమలు చేశారు. అయితే 17 ఏళ్లు గడిచినా 26/11 గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. అమరుల త్యాగాన్ని శిరసావహిస్తూ, భవిష్యత్తులో అలాంటి దుర్ఘటనలు మళ్లీ ఎప్పటికీ పునరావృతం కాకూడదన్న సందేశాన్ని ఈ రోజు దేశం మరోసారి నినదిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.